పదో రోజూ ఇంధన ధరలు పైకే..!
దేశంలో ఇంధన ధరల పెరుగుదల రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా
దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదల రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా పదో రోజూ ఇంధన ధరలు పెంచాయి. పెట్రోల్పై 34 పైసలు, డీజిల్పై 32 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గురువారం నిర్ణయించాయి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.88 కి చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.80.27కి చేరింది. వరుసగా పది రోజుల్లో కలిపి దేశంలో లీటర్ పెట్రోల్పై రూ.2.93, డీజిల్పై రూ.3.14 చొప్పున పెరిగింది.
ఇక ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.34, డీజిల్ ధర రూ.87.32గా నమోదైంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.93.64గా, డీజిల్ ధర రూ.87.52గా నమోదైంది. కాగా ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగా నగర్లో లీటర్ సాధారణ పెట్రోల్ రికార్డు స్థాయిలో రూ.100 మార్కును చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ పెట్రోల్ డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరుసగా పెట్రో ధరల పెంపుతో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం పెట్రో ధరల పెరుగుదల గత ప్రభుత్వాల పాపమేనని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాట పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మోదీ.. గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులను తగ్గించడంపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం