IPO: సగానికి తగ్గిన ఐపీఓలు.. ఎల్ఐసీ తీసేస్తే అంతంత మాత్రమే
IPO: 2021-22లో వివిధ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1,11,547 కోట్లు సమకూర్చుకున్నాయి. 2022-23 (FY23)లో ఆ విలువ రూ.52,116 కోట్లకు పడిపోయింది.
ముంబయి: రేపటితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ (IPO)ల జోరు నెమ్మదించింది. 2021-22 (FY22)తో పోలిస్తే ఈ ఏడాది విలువపరంగా పబ్లిక్ ఇష్యూలు దాదాపు సగానికి పడిపోయాయి. క్రితం ఏడాది 53 కంపెనీల షేర్లు మార్కెట్లో కొత్తగా నమోదు కాగా.. ఈసారి ఆ సంఖ్య 37కు పరిమితమైనట్లు ప్రైమ్ డేటాబేస్ గణాంకాంలు వెల్లడించాయి.
ఎల్ఐసీ తీసేస్తే..
ఎఫ్వై22లో వివిధ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1,11,547 కోట్లు సమకూర్చుకున్నాయి. 2022-23 (FY23)లో ఆ విలువ రూ.52,116 కోట్లకు పడిపోయింది. పైగా దీంట్లో ఒక్క ఎల్ఐసీ ఐపీఓ ద్వారానే రూ.20,557 కోట్లు సమకూరాయి. ఏడాది మొత్తంలో ఐపీఓ ద్వారా వచ్చిన నిధుల్లో ఇది 39 శాతానికి సమానం. ఎల్ఐసీని మినహాయిస్తే ఈసారి ఐపీఓల ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న మొత్తం రూ.31,559 కోట్లకు పరిమితమై ఉండేది.
రీట్స్/ఇన్విట్ల ద్వారా రూ.1,166 కోట్లు..
మొత్తంగా ఎఫ్వై23లో పబ్లిక్ ఈక్విటీ నిధుల సమీకరణ ద్వారా రూ.76,076 కోట్లు సమకూరాయి. క్రితం ఏడాది వచ్చిన రూ.1,73,728 కోట్లతో పోలిస్తే ఈసారి 56 శాతం క్షీణత నమోదైంది. ఎస్ఎంఈ ఇష్యూలు కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా రూ.54,344 కోట్లు సమకూరాయి. దీంట్లో క్యాపిటల్ మార్కెట్ల మార్గాన రూ.85,021 కోట్లు వచ్చాయి. దీంట్లో ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.11,231 కోట్లు, క్యూఐపీల ద్వారా రూ.8,169 కోట్లు, రీట్స్/ఇన్విట్ల మార్గాన రూ.1,166 కోట్లు సమకూరాయి. మరోవైపు పబ్లిక్ బాండ్ల ద్వారా కంపెనీలు మరో రూ.8,944 కోట్లు రాబట్టుకున్నాయి. ఇలా ఐపీఓ, బాండ్లు కలిపి మొత్తంగా ఈ ఏడాదిలో వివిధ సంస్థలు రూ.85,021 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఈ మొత్తం రూ.1,85,438 కోట్లుగా నమోదైంది.
కొత్తతరం సాంకేతిక కంపెనీలు వెనక్కి..
ఈ ఆర్థిక సంవత్సరం అతిపెద్ద ఐపీఓల జాబితాలో ఎల్ఐసీ (రూ.రూ.20,557 కోట్లు), డెలివరీ (రూ.5,235 కోట్లు), గ్లోబల్ హెల్త్ (రూ.2,206 కోట్లు) ఉన్నాయి. ఈ ఏడాదిలో వచ్చిన మొత్తం 37 పబ్లిక్ ఇష్యూల్లో 25 మే, నవంబర్, డిసెంబరు నెలల్లోనే రావడం గమనార్హం. నాలుగో త్రైమాసికంలో ఐపీఓల సంఖ్య తొమ్మిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మొత్తం 37 ఐపీఓల్లో కేవలం రెండు మాత్రమే కొత్తతరం సాంకేతిక కంపెనీలు. క్రితం ఏడాది ఈ రంగంలో ఐదు కంపెనీలు రూ.41,733 కోట్లు సమకూర్చుకున్నాయి.
ప్రజల స్పందన అంతంతే..
ఐపీఓలపై ఈ ఏడాది ప్రజల ఆసక్తి సైతం తగ్గింది. 11 ఇష్యూలకు మాత్రమే 10 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం సైతం గణనీయంగా పడిపోయింది. క్రితం ఏడాది రిటైల్ మదుపర్ల నుంచి సగటున 13.32 లక్షల దరఖాస్తులు రాగా.. ఈసారి అది 5.64 లక్షలకు తగ్గింది.
సిద్ధంగా 54 ఐపీఓలు..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చాలా కంపెనీలు ఐపీఓకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 54 కంపెనీలు సెబీ అనుమతి పొంది సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి రూ.76,189 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరో రూ.32,940 కోట్ల సమీకరణకు 19 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.