Budget 2023: మరోసారి ‘వివాద్ సే విశ్వాస్’ తరహా పథకం..?
పన్ను వివాదాల కేసులు కొండలా పేరుకుపోవడంతో వీటిని తగ్గించడంపై మోదీ సర్కారు దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్తగా పన్ను వివాదాల పరిష్కారానికి ఓ పథకాన్ని ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: ఆదాయపు పన్ను లిటిగేషన్లు కేంద్రానికి, పన్ను చెల్లింపుదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. గతేడాది ఏప్రిల్ నాటికి ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రూ.8.40 లక్షల కోట్ల మేరకు పన్ను బకాయిలు ఎటూ తేలకుండా ఉండిపోయాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్రానికి నిధుల అవసరాలు పెరిగిపోయాయి. మాంద్యం భయాల నేపథ్యంలో పన్ను ఆదాయాల్లో పెరుగుదలను ఆశించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బడ్జెట్(Budget 2023)లో పన్ను పరిష్కార (అమ్నెస్టీ) పథకాన్ని తీసుకొచ్చే అంశంపై ఆర్థిక శాఖ తీవ్రంగా ఆలోచిస్తోంది. దీంతో లిటిగేషన్లలో ఉన్న కేసులు వేర్వేరు వేదికలపై అప్పీళ్లకు వెళ్లి సమయం, సొమ్ము రెండూ వృథా చేసుకోవనేది ప్రభుత్వ భావన.
కరోనా సమయంలో ఆదాయపు పన్ను వివాదాల కేసుల పరిష్కారం బాగా మందగించింది. దీంతో ఇప్పటికే కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ (అప్పీళ్లు) వద్ద భారీ ఎత్తున కేసులు పెండింగ్లో ఉన్నాయి. చాలా కేసుల విచారణ కూడా మొదలు కాలేదు. మార్చి 2021 నాటికి ఏడాది నుంచి రెండేళ్లలోపు వివాదాల్లో ఉన్న మొత్తం రూ.6.58 లక్షల కోట్లు. అదే రెండు నుంచి ఐదేళ్లుగా వివాదంలో ఉన్న మొత్తం రూ.3.4లక్షల కోట్లుగా ఉంది.
గతంలో సానుకూల ఫలితాలు..
గతంలో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాలను ప్రవేశపెట్టిన సమయంలో లిటిగేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో పన్ను వివాదాల్లో ఉన్న మొత్తం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది. 2016-18 మధ్య స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ప్రభావంతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2016-17లో పన్ను చెల్లింపుదారులు వారి రహస్య ఆదాయాన్ని స్వచ్ఛందంగా బహిర్గతం చేయదల్చుకొంటే దానిపై 30శాతం పన్ను, 7.5శాతం సర్ ఛార్జి, 7.5శాతం పెనాల్టీ చెల్లించేలా స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే బడ్జెట్లో వివాద పరిష్కారానికి కూడా అవకాశం కల్పించారు.
కానీ, 2020లో మళ్లీ ఆ మొత్తం విపరీతంగా పెరిగి రూ.8.5 లక్షల కోట్లను దాటేసింది.
2020లో కేంద్రం ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. టీడీఎస్ సంబంధిత, వడ్డీ, జరిమానాకు సంబంధించిన వివాదాలను దీనిలో పరిష్కరించుకొనే అవకాశాలను కల్పించింది. ఇది విజయవంతమైంది. దీని పరిధిలోకి వచ్చే పన్ను వివాదాల మొత్తం రూ.99,756 కోట్లు ఉండగా.. వీటిల్లో రూ.53,684 కోట్లకు సంబంధించి కేసులు పరిష్కారమైనట్లు కేంద్రం పార్లమెంట్కు వెల్లడించింది.
ఇటువంటి పథకాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని పన్ను నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా సీఐటీ(ఏ) స్థాయిలోని వివాదాలను తేలిగ్గా పరిష్కరించుకొనే అవకాశం లభిస్తుంది. కొవిడ్ సమయంలో ఆన్లైన్ సెటిల్మెంట్ సౌకర్యం లభించని సమయంలోని కేసులకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు.. లిటేగేషన్లను కొనసాగించి.. చివరికి పెనాల్టీలు చెల్లించుకొనే పరిస్థితి నుంచి పన్ను చెల్లింపుదారులు తప్పించుకోవచ్చు. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ కూడా ఇటువంటి పథకాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఈ దిశగా దృష్టిపెట్టడం గమనార్హం. ప్రజలకు పన్ను వివాదాలను తగ్గించి.. వారిని ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసే ఇటువంటి యత్నాలకు ఆదరణ కూడా లభిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్