GAIL Share Buyback: షేర్ల బైబ్యాక్పై 31న గెయిల్ నిర్ణయం
ప్రభుత్వ రంగానికి చెందిన ‘గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (GAIL) మరోసారి షేర్ల బైబ్యాక్కు యోచిస్తోంది. ఈ మేరకు మార్చి 31న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది....
దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన ‘గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (GAIL) మరోసారి షేర్ల బైబ్యాక్కు యోచిస్తోంది. ఈ మేరకు మార్చి 31న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. మార్చితో ముగియనున్న త్రైమాసికంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలకు కూడా బోర్డు అదేరోజు ఆమోదం తెలపనుంది. గెయిల్లో ప్రభుత్వానికి 51.80 శాతం వాటా ఉంది. ఒకవేళ బైబ్యాక్ చేపడితే ప్రభుత్వం కూడా అందులో పాల్గొననుంది. 2020-21లోనూ గెయిల్ షేర్లను బైబ్యాక్ చేసింది. అందుకు దాదాపు రూ.747 కోట్లు వెచ్చించింది.
మదుపర్లు లేదా షేర్హోల్డర్ల దగ్గరి నుంచి కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తే దాన్ని షేర్ల బైబ్యాక్ లేదా షేర్ల రీపర్చేజ్ అంటారు. వాటాదార్లకు పన్ను భారం లేకుండా వారి పెట్టుబడిని తిరిగిచ్చేయడానికి కంపెనీకి ఇదొక మార్గం. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉండే షేర్ల సంఖ్య తగ్గుతుంది. దీంతో డిమాండ్ పెరిగి కంపెనీ మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల