5G Auction: తొలి రోజు రూ.1.45 లక్షల కోట్ల బిడ్లు
5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తొలి రోజున ముకేశ్ అంబానీ, సునీల్ మిత్తల్, గౌతమ్ అదానీ గ్రూప్లు రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలు చేశాయి. టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు సొంత నెట్వర్క్ కోసం అదానీ గ్రూప్ సైతం ఇందులో పాల్గొంది. 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగాన్ని, అంతరాయం లేని అనుసంధానత సేవలను అందించడమే 5జీ స్పెక్ట్రమ్ ప్రత్యేకత. ఖరీదైన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసమూ బిడ్లు దాఖలయ్యాయని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్లతో చెప్పారు.
టెల్కోలతో పాటు అదానీ కూడా
దిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తొలి రోజున ముకేశ్ అంబానీ, సునీల్ మిత్తల్, గౌతమ్ అదానీ గ్రూప్లు రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలు చేశాయి. టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు సొంత నెట్వర్క్ కోసం అదానీ గ్రూప్ సైతం ఇందులో పాల్గొంది. 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగాన్ని, అంతరాయం లేని అనుసంధానత సేవలను అందించడమే 5జీ స్పెక్ట్రమ్ ప్రత్యేకత. ఖరీదైన 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసమూ బిడ్లు దాఖలయ్యాయని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్లతో చెప్పారు. అన్ని అంచనాలను మించి, తొలి రోజు బిడ్డింగ్లో రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లను ప్రభుత్వం అందుకున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా 2015 రికార్డులను అధిగమించినట్లు అయ్యింది. వేలం ప్రక్రియ ముగిసే వరకు, ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసిందో వెల్లడి కావు. తొలి రోజున నాలుగు దశల్లో బిడ్డింగ్ జరగ్గా.. 3300 మెగాహెర్ట్జ్, 26 గిగా హెర్ట్జ్కు అధికంగా బిడ్లు వచ్చాయి. నలుగురు బిడ్డర్లూ ‘బలం’గానే ఈ వేలంలో పాల్గొన్నారని వైష్ణవ్ తెలిపారు. పరిశ్రమ స్పందన చూస్తుంటే.. సంక్లిష్ట సమయాల నుంచి బయట పడ్డట్లు అర్థమవుతోందన్నారు.
ఇదీ చదవండి: 5జీ దేశవ్యాప్తంగా ఎప్పుడు..?రేట్లు ఎంత ఉండబోతున్నాయ్?
ఆగస్టు 14 కల్లా స్పెక్ట్రమ్ కేటాయింపు
వేలం పూర్తయ్యాక, స్పెక్ట్రమ్ను ఆగస్టు 14 కల్లా కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని ఆయన అంచనా వేశారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. పూర్తి నిడివి గల అత్యంత నాణ్యమైన వీడియో లేదా సినిమాను సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇ-హెల్త్, కనెక్టెడ్ వెహికల్స్, మెరుగైన ఆగుమెంటెడ్ రియాల్టీ, మెటావర్స్ అనుభవాలు, అధునాతన మొబైల్ క్లౌడ్ గేమింగ్ వంటివి అందుబాటులోకి వస్తాయి.
నేడూ కొనసాగుతుంది..
బుధవారమూ వేలం కొనసాగనుంది. 600, 700, 800, 900, 1800, 2100, 2300, 3300 మెగాహెర్ట్జ్తో పాటు 26 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలం జరుగుతోంది. ఈ స్పెక్ట్రమ్ కనీస విలువ రూ.4.3 లక్షల కోట్లు.
ఇదీ చదవండి: 5జీ వేలంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమెంత?
ఇ-బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపునకు డాట్ అనుమతి
ఇ-బ్యాండ్ స్పెక్ట్రమ్ను టెలికాం కంపెనీలకు తాత్కాలికంగా కేటాయించడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్) ఆమోదముద్ర వేసింది. 5జీ వైర్లెస్ సేవలను మెరుగ్గా అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ నోటిఫికేషన్ వెల్లడించింది. దేశంలో టవర్లు భారీ సంఖ్యలో లేని నేపథ్యంలో, 5జీ స్పెక్ట్రమ్తో పాటు ఇ-బ్యాండ్ను సైతం కేటాయించాలని టెలికాం కంపెనీలు కోరాయి. దీని వల్ల అధిక వేగం, నాణ్యమైన 5జీ నెట్వర్క్ను అందించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇ-బ్యాండ్ అనేది ఫైబరైజేషన్కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. 71-86 గిగాహెర్ట్జ్ మధ్య లభిస్తుంది. అధిక నెట్వర్క్ వేగంతో, భారీ స్థాయి బ్రాడ్బ్యాండ్ రద్దీకి ఇది మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుతం 35 శాతం టెలికాం టవర్లు మాత్రమే టెలికాం ప్రధాన నెట్వర్క్లకు ఫైబర్ లింక్ల ద్వారా అనుసంధానం అయ్యాయి. మిగతావన్నీ పాయింట్-టు-పాయింట్ వైర్లెస్ లింకింగ్ ద్వారా అనుసంధానం అయి ఉన్నాయి. ప్రస్తుత పాయింట్-టు-పాయింట్ వైర్లెస్ లింక్లను అత్యధిక వేగానికి(5జీ) వినియోగించలేరు కనుక, టెల్కోల విజ్ఞప్తికి డాట్ ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..