బీఎస్ఎన్ఎల్కు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీ
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సేవల మెరుగు కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపినట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కేంద్ర మంత్రి మండలి ఆమోదం
దిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సేవల మెరుగు కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపినట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సేవలను మెరుగు పరచేందుకు తాజా మూలధనం, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు, బ్యాలెన్స్ షీట్పై ఒత్తిడి తగ్గించడం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ కోసం భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్తో విలీనం చేసే చర్యలు ఈ ప్యాకేజీ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.43,694 కోట్లు నగదు రూపేణ, రూ.1.2 లక్షల కోట్లు నగదేతర రూపంలో నాలుగేళ్ల కాల వ్యవధిలో అందించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని వెల్లడించారు.
* బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రారంభించేందుకు 900/1800 మెగాహెర్ట్జ్్స బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపునకు అవసరమైన రూ.44,993 కోట్లను ఈక్విటీ ద్వారా చొప్పించనున్నట్లు తెలిపారు. వచ్చే 4 ఏళ్ల పాటు ఈ వ్యవస్థ అభివృద్ధికి రూ.22,471 కోట్ల మూలధన వ్యయాలు అవసరమవుతాయన్నది అంచనాగా పేర్కొన్నారు.
* వాణిజ్యపరంగా అనుకూలం కాని గ్రామీణ వైర్లైన్ కార్యకలాపాల కోసం వయబిలిటీ-గ్యాప్ ఫండింగ్ కింద రూ.13,789 కోట్లు, బ్యాలెన్స్ షీట్లో ఒత్తిడి తగ్గించేందుకు మరో రూ.33,404 కోట్ల బకాయిల్ని ఈక్విటీగా మార్చాలని నిర్ణయించారు.
* ప్రస్తుత రుణాల చెల్లింపునకు వీలుగా, నిధుల్ని బీఎస్ఎన్ఎల్ సమీకరించేందుకు సార్వభౌమ గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్నెట్, బీబీఎన్ఎల్ మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు వాటిని బీఎస్ఎన్ఎల్తో విలీనం చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కవరేజీ లేని గ్రామీణ ప్రాంతాల్లోనూ 4జీ మొబైల్ సేవల కోసం రూ.26,316 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
రెండేళ్లలో 5జీ సేవలు కూడా: 2019లో ప్రకటించిన రూ.74,000 కోట్ల ప్యాకేజీ అనంతరం, బీఎస్ఎన్ఎల్ రూ.1,000 కోట్ల వార్షిక నిర్వహణ లాభాన్ని ఆర్జిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆర్థికంగా పునర్నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. 3-4 ఏళ్లలో సంస్థ నికర లాభాన్ని ఆర్జిస్తుందన్నారు. రెండేళ్లలో 5జీ సేవలు కూడా ప్రారంభం కావొచ్చన్నారు. ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ విలీన ప్రణాళికకు మరింత సమయం పట్టొచ్చని, దీనికి సంక్లిష్ట ఆర్థిక పునర్నిర్మాణ ప్రక్రియ అవసరమవుతుందని తెలిపారు.
బ్రెజిల్లో బీపీసీఎల్ పెట్టుబడులకు అనుమతి: బీపీసీఎల్ బ్రెజిల్లోని భారత్ పెట్రో రిసోర్సెస్ లిమిటెడ్ (బీఆర్పీఎల్) చమురు క్షేత్రంలో అదనంగా 1.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,800 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం