EMI: ఈఎంఐ మరింత భారం
రెపో రేటును 0.50 శాతం పెంచి, 5.40 శాతానికి పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది.
రెపో రేటు 0.50 పెరిగి 5.40 శాతానికి చేరడం వల్లే
ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు యథాతథంగా
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష
‘అంతర్జాతీయ పరిణామాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణ సమస్యనూ ఎదుర్కొంటోంది. పటిష్ఠ మూలాల కారణంగా 2022-23లోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం కొనసాగుతుంది. ఆర్థిక రంగం వద్ద తగినంత మూలధనం ఉంది. మనకు సరిపడా విదేశీ మారకపు నిల్వలూ ఉన్నందున, పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు. మన వ్యాపారంలో తైవాన్ వాటా 0.7 శాతమే కావడంతో, తాజా ఉద్రిక్తతల ప్రభావం పెద్దగా ఉండదు.’ - శక్తికాంత దాస్,ఆర్బీఐ గవర్నరు
ఈనాడు బిజినెస్బ్యూరో- వాణిజ్య విభాగం
రెపో రేటును 0.50 శాతం పెంచి, 5.40 శాతానికి పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. ఈనెల 3-5 మధ్య జరిగిన ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. మేలో 0.40 శాతం, జూన్లో 0.50 శాతం, తాజాగా 0.50 శాతం పెంచడంతో, 3 నెలల వ్యవధిలోనే రెపోరేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) 1.40 శాతం పెరిగింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ ఎక్స్టర్నల్ బెంచ్ మార్కుగా రెపోరేటును తీసుకుంటున్నాయి. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు ఏమాత్రం ఆలస్యం చేయవు. అంటే ఏప్రిల్లో 6.5-7 శాతం వడ్డీరేటుకు లభించిన రుణం, ఇప్పుడు 8 శాతానికి మించే అవకాశాలున్నాయి. దీనివల్ల ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం/రుణం చెల్లింపు కాలం పెరుగుతుంది. బ్యాంకు రుణం తీసుకుని, కొత్తగా ఇల్లు కొనాలని అనుకునే వారికి ఇబ్బందే. ఆదాయానికి తగ్గట్లు ఇచ్చే రుణం మొత్తం తగ్గుతుంది. దీంతో చేతి నుంచి అధికంగా మార్జిన్ మనీ చెల్లించాల్సి వస్తుంది. ఇంటి కోసం రూ.30 లక్షల రుణం తీసుకున్న వారి ఈఎంఐ ఏప్రిల్తో పోలిస్తే, ఇప్పుడు రూ. 2,500కు మించడంతో నెలవారీ బడ్జెట్పై ప్రభావం పడుతుంది. వాహన, వ్యక్తిగత రుణాలదీ ఇదే పరిస్థితి.
మరిన్ని రేట్ల పెంపునకు సంకేతాలు
రెపోరేటు ప్రతిపాదనకు ఎంపీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ‘సర్దుబాటు’ విధాన వైఖరిని క్రమంగా ఉపసంహరించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇక్కడితో రేట్ల పెంపును ఆపేస్తామని అనుకోకూడదని, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేవరకు మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని ఆర్బీఐ గవర్నరు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.2 శాతం, ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందన్న గత అంచనాలనే ఆర్బీఐ కొనసాగించింది.
డిపాజిటర్లకు ఊరట
గత రెండేళ్లుగా తక్కువ వడ్డీ రేట్లతో ఇబ్బంది పడుతున్న డిపాజిటర్లకు మాత్రం ఇది కలిసొచ్చే అంశం. వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 7 శాతానికి చేరితే.. అయిదేళ్ల వ్యవధికి రూ.లక్ష డిపాజిట్పై దాదాపు రూ.3,436 అధికంగా లభిస్తుంది. సాధారణంగా డిపాజిట్ వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి 8 శాతం మధ్యలో ఉంటే మంచి రేటుగానే భావిస్తారు. రాబోయే 6 నెలల్లో వడ్డీ రేటు మరో 1 శాతం పెరుగుతుందనే అంచనాలున్నాయి. పెరుగుతున్న రెపో ధోరణిని గమనిస్తే, ఆర్థిక సంవత్సరం చివరికి డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటు లభిస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికే పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు 7.475 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. సీనియర్ సిటిజన్లకు ఇది లాభదాయకమే. కొత్తతరం బ్యాంకులు ఇప్పటికే ఎఫ్డీలపై 7.5శాతానికి మించి వడ్డీ అందిస్తున్నాయి.
బ్యాంకులు రుణ రేట్లు పెంచేస్తున్నాయ్
* ఇండియన్ బ్యాంక్ రెపో ఆధారిత రుణరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి, 8.20శాతానికి చేర్చింది. ఈనెల 6 నుంచి ఇది అమల్లోకి రానుంది.
* ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టెర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటును ఈనెల 5 నుంచి 9.10 శాతానికి పెంచినట్లు తెలిపింది.
* పీఎన్బీ తమ రెపో రేటు అనుసంధానిత రుణ రేటును 7.40 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త రేట్లు ఆగస్టు 8 నుంచి అమల్లోకి వస్తాయి.
ప్రవాసులూ మన బిల్లులు, ఫీజులు కట్టొచ్చు
భారత్లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యుల తరపున వివిధ బిల్లులు, విద్యా రుసుములను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా విదేశాల్లో నివశిస్తున్న ప్రవాస భారతీయులు కూడా చెల్లించే సదుపాయాన్ని త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందుబాటులోకి తేనుంది. దీని వల్ల వయోవృద్ధులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 20,000కి పైగా సంస్థలు బీబీపీఎస్ ప్లాట్ఫామ్పై బిల్లులు వసూలు చేసుకుంటున్నాయి. ప్రతినెలా 8 కోట్లకు పైగా లావాదేవీలు దీని ద్వారా జరుగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తగ్గిన నేపథ్యంలో, విదేశీ మారకపు ద్రవ్యాన్ని ఆకర్షించాలన్నదే ఈ నిర్ణయం వెనక ఆర్బీఐ ఉద్దేశంగా తెలుస్తోంది.
రూపాయి స్థిరత్వంపై దృష్టి
అమెరికా డాలరు బలపడటం వల్లే రూపాయి మారకపు విలువ క్షీణించినట్లు కన్పిస్తోందని శక్తికాంత్ దాస్ చెప్పారు. అంతేకానీ భారత స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల కాదని స్పష్టం చేశారు. రూపాయి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, విలువ స్థిరత్వంపై దృష్టి పెట్టామని చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ వద్ద సరిపడా విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయని, అత్యధిక విదేశీ మారకపు నిల్వలున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.
బ్యాంకులు పూర్తిగా ఆర్బీఐపై ఆధారపడొద్దు
రుణాల జారీకి అవసరమైన నిధుల కోసం బ్యాంకులు పూర్తిగా ఆర్బీఐపైనే ఆధారపడకూడదని దాస్ అన్నారు. మరిన్ని డిపాజిట్లను అవి సమీకరించాలని, సొంతంగా నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టాలని చెప్పారు.
తదుపరి పరపతి విధాన సమీక్ష సెప్టెంబరు 28- 30 తేదీల్లో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు