Stockmarket: సూచీలకు స్వల్ప లాభాలు
రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రేట్ల పెంపు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో, సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.
సమీక్ష
రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రేట్ల పెంపు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో, సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం, చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 17 పైసలు బలపడి 79.23 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 0.18 శాతం పెరిగి 94.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఉదయం 58,421.04 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే ఊపు కొనసాగిస్తూ ఇంట్రాడేలో 58,649.19 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుని 58,244.86 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 89.13 పాయింట్లు పెరిగి 58,387.93 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 15.50 పాయింట్లు లాభపడి 17,397.50 దగ్గర స్థిరపడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 817.68 పాయింట్లు, నిఫ్టీ 239.25 పాయింట్లు చొప్పున లాభాలు నమోదుచేశాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 17 లాభపడ్డాయి. అల్ట్రాటెక్ 2.86%, భారతీ ఎయిర్టెల్ 1.39%, పవర్గ్రిడ్ 1.20%, ఇన్ఫోసిస్ 1.06%, విప్రో 1.02% చొప్పున రాణించాయి. ఎం అండ్ ఎం, మారుతీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ 2% నష్టపోయాయి.
* ఆర్బీఐ పరపతి సమీక్ష నేపథ్యంలో వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు మిశ్రమంగా ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ 2.26%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1.66%, యాక్సిస్ బ్యాంక్ 0.90%, ఫెడరల్ బ్యాంక్ 0.88% పెరగ్గా, బంధన్ బ్యాంక్ 1.70%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.30% నష్టపోయాయి. వాహన షేర్లలో టీవీఎస్, ఎస్కార్ట్స్, ఎంఆర్ఎఫ్, బజాజ్ ఆటో 1.46% మేర రాణించగా.. మహీంద్రా, ఐషర్, హీరో మోటో, టాటా మోటార్స్ 2% వరకు డీలాపడ్డాయి. స్థిరాస్తి షేర్లలో ఫీనిక్స్ 1.62%, ఐబీ రియల్ 0.84%, శోభా 0.5% లాభపడగా, సన్టెక్ రియాల్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ నీరసపడ్డాయి.
నేటి బోర్డు సమావేశాలు: ఎస్బీఐ * బీపీసీఎల్ * హెచ్పీసీఎల్ * ఐఓబీ * అమరరాజా బ్యాటరీస్ * ఆంధ్రా పెట్రోకెమికల్స్ * పాల్రెడ్ టెక్నాలజీస్ * బిర్లా కార్పొరేషన్ * జాగరణ్ ప్రకాశన్ * ఖాదిమ్ * మారికో * మంగళం సిమెంట్ * టెగా ఇండస్ట్రీస్ * ఉషా మార్టిన్ * మహానగర్ గ్యాస్
అమెరికాలో కొత్తగా 5,28,000 ఉద్యోగాలు
వాషింగ్టన్: అమెరికాలో నియామకాల జోరు కొనసాగుతోంది. గత నెలలో అక్కడి కంపెనీలు కొత్తగా 5,28,000 ఉద్యోగాలను సృష్టించాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల, మాంద్యంపై భయాలు ఉన్నప్పటికీ నియామకాలు పెరగడం గమనార్హం. కరోనా సంక్షోభం కారణంగా కోల్పోయిన అన్ని ఉద్యోగాలు మళ్లీ వచ్చాయని అమెరికా కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జూన్లో ఈ సంఖ్య 3,98,000 ఉద్యోగాలుగా నమోదైంది. నిరుద్యోగ రేటు 3.5 శాతానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు