Edible oil: వంటనూనె ధర లీటరుకు మరో రూ.10-12 తగ్గుతుంది
వంట నూనెల ధరల్లో లీటరుకు రూ.10-12 మేర తయారీదార్లు కోత వేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గుతున్నందున ఆ ప్రయోజనాలను వినియోగదార్లకు అందించాలని అవి భావిస్తున్నట్లు సమాచారం.
తయారీదార్ల అంగీకారం
వంట నూనెల ధరల్లో లీటరుకు రూ.10-12 మేర తయారీదార్లు కోత వేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గుతున్నందున ఆ ప్రయోజనాలను వినియోగదార్లకు అందించాలని అవి భావిస్తున్నట్లు సమాచారం. ‘వంట నూనె తయారీదార్లు లీటరుకు మరో రూ.10-12 మేర కోత వేయడానికి అంగీకరించినట్లు ఆహార, వినియోగదారు వ్యహారాల మంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశం అనంతరం తమతో తెలిపిన’ట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అదానీ విల్మర్తో పాటు వంట నూనెల తయారీ కంపెనీలు ఇటీవలి కాలంలో లీటరుకు రూ.30 దాకా తగ్గించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు కిందకు దిగిరావడం ఇందుకు నేపథ్యం. ఫార్చూన్ బ్రాండ్ కింద ఉత్పత్తులను విక్రయిస్తున్న అదానీ విల్మర్ సోయాబీన్ నూనెపై ఎక్కువగా ధర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ధరల తగ్గింపునకు మరింత అవకాశం ఉందని మంత్రిత్వశాఖ సూచించడంతో అందుకు తయారీదార్లు అంగీకరించారని ఒక అధికారిని ఉటంకిస్తూ ఆంగ్లపత్రికలు తెలిపాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అన్ని వంటనూనెల అసోసియేషన్లను ఆహార కార్యదర్శి సుధాంశు పాండే సమావేశానికి పిలిచారు.
దిగుమతులపై ఆధారపడడం వల్లే..: ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా ఉన్న భారత్ తన దేశీయ అవసరాలకు మలేషియా, ఇండోనేషియాలపై ఆధారపడుతోంది. ఏటా 13.5 మిలియన్ టన్నుల వంటనూనెను దేశం దిగుమతి చేసుకుంటుండగా.. ఇందులో 8-8.5 మి. టన్నులు(63%) పామాయిలే ఉంటోంది. ప్రస్తుతం దాదాపు 45 శాతం ఇండోనేషియా నుంచి వస్తుండగా.. మిగతా మలేషియా నుంచి దిగుమతి అవుతోంది. ఏటా ఇండోనేషియా నుంచి 4 మి. టన్నుల మేర పామాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఏప్రిల్లో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో భారత్లోనూ ధరలు పెరిగాయి. మే 23న మళ్లీ నిషేధాన్ని ఎత్తివేయడంతో.. ఆ తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్