StockMarket: భారీ నష్టాలుండవు కానీ..
రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి పెంచిన నేపథ్యంలో, ఇక మదుపర్ల దృష్టి అంతా దేశీయ, అమెరికా ఆర్థిక గణాంకాలపై ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
స్థిరీకరణకు అవకాశం
17150 పైన నిఫ్టీకి సానుకూలతలు
వాహన షేర్లు రాణించొచ్చు
విశ్లేషకుల అంచనాలు
రేపు మొహర్రం సెలవు కనుక 4 రోజులే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్ ఈ వారం
రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి పెంచిన నేపథ్యంలో, ఇక మదుపర్ల దృష్టి అంతా దేశీయ, అమెరికా ఆర్థిక గణాంకాలపై ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ-50 స్థిరీకరణ కావచ్చని, అయితే భారీ దిద్దుబాటు జరగక పోవచ్చంటున్నారు. అమెరికా ఉద్యోగ గణాంకాల నుంచి ఫెడరల్ రిజర్వ్, అమెరికా మార్కెట్లు ఎటువంటి సంకేతాలు తీసుకుంటాయన్నది కీలకం. బుధవారం వెలువడే అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణంపైనా దృష్టి పెట్టొచ్చు. దేశీయంగా చూస్తే జులై నెలకు సంబంధించి సియామ్ విడుదల చేసే వాహన గణాంకాలు, శుక్రవారం వెలువడే రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలను పరిశీలించొచ్చు. ఈ వారం విడుదలయ్యే అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఫలితాలూ మార్కెట్ను ప్రభావితం చేయొచ్చు. నిఫ్టీ 17,150 పాయింట్లకు పైన చలించినంత వరకు సానుకూలతలే కనిపిస్తాయని అభిప్రాయపడుతున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* సిమెంటు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చు. విక్రయాల వృద్ధి ధోరణిని గమనించాలి.
* చైనా ఉక్కు అవసరాలు మన లోహ కంపెనీలకూ కీలకమే. అక్కడి స్థిరాస్తి రంగం పుంజుకుంటే దేశీయ ఉక్కు తయారీదార్ల అమ్మకాలు పెరగొచ్చు. ఐరోపా ఉక్కు గిరాకీనీ గమనించాలి.
* ఆయిల్ ఇండియా(బుధ), ఓఎన్జీసీ(శుక్ర) ఫలితాలు చమురు షేర్లపై ప్రభావం చూపుతాయి.
* మదుపర్ల వేచి చూసే ధోరణితో ఔషధ షేర్లలో ట్రేడింగ్ స్తబ్దుగా జరగొచ్చు. ఈ వారం విడుదలయ్యే అరబిందో, అబాట్, దివీస్, జైడస్, నాట్కో, ఇప్కా, గ్లెన్మార్క్ ఫలితాలు, గిరాకీ, నూతన ఉత్పత్తులనూ గమనించొచ్చు.
* ఎఫ్ఎమ్సీజీ షేర్లలో అధిక కొనుగోళ్లు జరగడం వల్ల.. తాజా పొజిషన్లు జతచేసుకోకపోవచ్చు. అయితే తక్షణం విక్రయాల ఒత్తిడి ఎదురుకాకపోవచ్చు.
* బ్యాంకు షేర్లపై ఎస్బీఐ ఫలితాల ప్రభావం ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, తగ్గుతున్న చమురు ధరలు, అధిక ద్రవ్యోల్బణం వల్ల బ్యాంకు షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత, రుణ వృద్ధి మెరుగుపడుతుండడం కలిసొచ్చే అంశం.
* నేడు భారతీ ఎయిర్టెల్ ప్రకటించే ఫలితాలను బట్టి టెలికాం షేర్లు కదలాడొచ్చు. త్రైమాసికం వారీగా కంపెనీ ఆదాయం, లాభం వరుసగా 3.7%, 21.7% మేర వృద్ధి చెందొచ్చన్న అంచనాలున్నాయి.
* అమెరికా ద్రవ్యోల్బణం, ఉద్యోగ గణాంకాల ఆధారంగా ఐటీ షేర్లు ట్రేడవవచ్చు.
* కమిన్స్ ఇండియా, ఏబీబీ, ఏఐఏ ఇంజినీరింగ్ సంస్థల ఫలితాల ఆధారంగా యంత్ర పరికరాల షేర్లు కదలాడొచ్చు. అంచనాల కంటే బలహీనంగా నమోదైన థెర్మాక్స్ ఫలితాలు; మాంద్యం భయాలు ప్రభావం చూపుతాయి. మధ్య నుంచి దీర్ఘకాలానికి ఈ రంగ వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయి.
* పండుగల సీజనులో గిరాకీ బాగుంటుందనే అంచనాలతో వాహన కంపెనీల షేర్లు రాణించొచ్చు. హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్ ఫలితాలను గమనించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ