Amit shah: ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్పై 300కి పైగా సహకార సంఘాలు
ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ (జీఈఎం) ప్లాట్ఫామ్పై 300కి పైగా సహకార సంఘాలు కొనుగోలుదార్లుగా నమోదయ్యాయని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో అమూల్, ఇఫ్కో లాంటివి ఉన్నాయని పేర్కొన్నారు.
విక్రయదార్లుగానూ నమోదవ్వండి
కేంద్ర మంత్రి అమిత్ షా సూచన
దిల్లీ: ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ (జీఈఎం) ప్లాట్ఫామ్పై 300కి పైగా సహకార సంఘాలు కొనుగోలుదార్లుగా నమోదయ్యాయని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందులో అమూల్, ఇఫ్కో లాంటివి ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఈ సంస్థలన్నీ సరఫరాదార్లుగా కూడా నమోదుకావాలని ఆయన సూచించారు. జీఈఎం పోర్టల్లో నమోదు ప్రక్రియను దృశ్యమాధ్యమ పద్ధతిలో మంగళవారం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. సహకార సంఘాలు కూడా తమకు కావాలిస వస్తువులు, సేవలను జీఈఎం ప్లాట్ఫాం ద్వారా కొనుగోలు చేసేందుకు జూన్లో కేంద్ర మంత్రివర్గం అనుమతినిచ్చింది. ప్రస్తుతం దేశంలోని 8.5 లక్షలకు పైగా సహకార సంఘాల్లో సుమారు 29 కోట్ల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు.
తొలి రోజు రూ.25 కోట్ల ఆర్డర్లు: తొలివిడతలో రూ.100 కోట్ల వరకు టర్నోవరు/ డిపాజిట్లు ఉన్న సహకార సంఘాలకు పోర్టల్లో నమోదయ్యేందుకు అనుమతినిచ్చారు. ఇందుకు అర్హత ఉన్న సంస్థల సంఖ్య 589గా గుర్తించగా.. 300కి పైగా సంస్థలు మంగళవారమే నమోదయ్యాయి. తద్వారా కొనుగోలు ఆర్డరు పెట్టే వీలును పొందాయి. వీటిల్లో ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, అమూల్, సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్ లాంటి ప్రముఖమైనవి ఉన్నాయి. మొదటి రోజే రూ.25 కోట్ల విలువైన కొనుగోలు ఆర్డర్లను ఈ సహకార సంఘాలు పెట్టే అవకాశం ఉంది. తొలి రోజు నమోదైన వాటిల్లో బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు 45 ఉన్నాయని మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ పోర్టల్పై నమోదయ్యేందుకు అర్హత పరిమితిని మున్ముందు సడలిస్తామని చెప్పారు. ‘సహకార సంఘాల మార్కెట్ను విస్తరించాల్సిన అవసరం ఉంది. జీఈఎం పోర్టల్ ద్వారా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి. అందువల్ల ఈ పోర్టల్పై విక్రయదార్లుగా నమోదుకావాలని సహకార సంఘాలను విజ్ఞప్తి చేస్తున్నామ’ని ఆయన అన్నారు.
* జీఈఎం పోర్టల్పై 61,851 ప్రభుత్వ కొనుగోలుదార్లు, 48.75 లక్షల విక్రయదార్లు, సేవా సంస్థలు నమోదయ్యాయి. 10,000 ఉత్పత్తులు, 288 సేవల విభాగంలో 45 లక్షలకు పైగా ఉత్పత్తులను జాబితాలో చేర్చాయి. ఇప్పటివరకు రూ.2,78,504 కోట్ల విలువైన 1.08 కోట్ల ఆర్డర్లు ఈ ప్లాట్ఫాం ద్వారా పూర్తయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.