Gail: గెయిల్ బోనస్ షేర్లపై 26న నిర్ణయం
ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఇండియా, షేర్ క్యాపిటల్ను రెట్టింపు చేయాలని భావిస్తోంది. గ్యాస్ సరఫరా, పంపిణీకి పరిమితం కాకుండా స్పెషాలిటీ రసాయనాలు, శుద్ధ ఇంధన వ్యాపారాల్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
షేర్ క్యాపిటల్ రూ.10,000 కోట్లకు
స్పెషాలిటీ రసాయనాలు, శుద్ధ ఇంధన వ్యాపారాల్లోకి ప్రవేశం
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఇండియా, షేర్ క్యాపిటల్ను రెట్టింపు చేయాలని భావిస్తోంది. గ్యాస్ సరఫరా, పంపిణీకి పరిమితం కాకుండా స్పెషాలిటీ రసాయనాలు, శుద్ధ ఇంధన వ్యాపారాల్లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రూ.5000 కోట్లుగా ఉన్న అధీకృత షేర్ క్యాపిటల్ను రూ.10000 కోట్లకు పెంచేందుకు గెయిల్ వాటాదార్ల అనుమతిని సంస్థ కోరింది. వచ్చే 3-4 ఏళ్లలో విస్తరణ ప్రణాళికలకు ఈ నిధులను కంపెనీ వినియోగించనుంది. 2030 నాటికి ప్రాథమిక ఇంధన వినియోగంలో గ్యాస్ వాటాను రెట్టింపునకు పైగా పెంచి, 15 శాతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా గెయిల్ జాతీయ గ్యాస్ గ్రిడ్ నిర్మాణానికి సహజగ్యాస్ ట్రక్ పైప్లైన్లను ఏర్పాటు చేయడంతో సిటీ గ్యాస్ సరఫరా వ్యవస్థలను విస్తరిస్తోంది. ‘వచ్చే 3-4 ఏళ్లలో గెయిల్కు దాదాపు రూ.30,000 కోట్ల మూలధన ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో కొంతమేర అంతర్గతంగా సమీకరించడంతో పాటు మరికొంత రుణంగా సమీకరించనుంది. ఇందులో ఈక్విటీ మార్గాలు కూడా ఉన్నాయి.
ప్రతి 2 షేర్లకు 1 బోనస్ షేరు: వాటాదార్లకు బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేయడానికి చూస్తున్నట్లు’ గెయిల్ వాటాదార్లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి 2 షేర్లకు 1 బోనస్ షేరు ఇవ్వాలన్నది సంస్థ ప్రణాళిక. ఈనెల 26న నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై వాటాదార్ల అనుమతిని సంస్థ కోరనుంది.
ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు: పెట్రోల్లో కలిపేందుకు వీలుగా బయోమాస్ నుంచి ఉత్పత్తి చేసే శుద్ధ ఇంధనం కోసం ఇథనాల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. శుద్ధ హైడ్రోజన్ వ్యాపారంపై కూడా ఆసక్తిగా ఉన్నట్లు గెయిల్ వెల్లడించింది. ఎనర్జీ ఎక్స్ఛేంజీలో ఈక్విటీ వాటా తీసుకోవాలని, సోలార్ గ్లాస్, మాడ్యూల్ తయారీ సంస్థలను స్వాధీనం చేసుకోవడంపైనా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. రోజంతా విద్యుదుత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పే ప్రణాళికలోనూ సంస్థ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ