శామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 విక్రయాలు సెప్టెంబరు నుంచి

శామ్‌సంగ్‌ తమ ప్రీమియం ‘గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 స్మార్ట్‌పోన్ల’ను భారత్‌లో సెప్టెంబరు నుంచి విక్రయించనుంది.

Published : 11 Aug 2022 05:15 IST

దిల్లీ: శామ్‌సంగ్‌ తమ ప్రీమియం ‘గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 స్మార్ట్‌పోన్ల’ను భారత్‌లో సెప్టెంబరు నుంచి విక్రయించనుంది. దేశీయంగా శామ్‌సంగ్‌ విక్రయిస్తున్న ఫోన్లలో ఇదే అత్యధిక ఖరీదైన ఫోన్‌ అవుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ విపణిలో విడుదల చేసినపుడు వీటి ధరలు 1,799 డాలర్లు (సుమారు రూ.1.42 లక్షలు). రూపాయి మారకపు విలువ క్షీణించడం, అధిక పన్నుల వల్ల భారతీయ వినియోగదార్లు మరింత మొత్తం ఈ స్మార్ట్‌ఫోన్లపై వెచ్చించాల్సి రావొచ్చని తెలుస్తోంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ 3 ఫోన్లను దేశీయంగా ఇప్పటికే విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1.49-1.57 లక్షల మధ్య ఉన్నాయి. ఫ్లిప్‌ 3 ఫోన్ల ధరలు రూ.84,999-89,999 మధ్య ఉన్నాయి.  జెడ్‌ ఫోల్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత అధికంగా ఉండొచ్చని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని