IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
రాబోయే త్రైమాసికాల్లో సిబ్బంది వలసల రేటు తగ్గుతుందని ఇన్ఫోసిస్ అంచనా వేస్తోంది. ఉద్యోగులతో తరచూ మాట్లాడుతుండడం; శిక్షణ ఇవ్వడం, వేతన పెంపుల వంటివి ఇందుకు ఉపకరిస్తాయని
వేతన పెంపులు ఉపకరిస్తాయ్
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్
బెంగళూరు: రాబోయే త్రైమాసికాల్లో సిబ్బంది వలసల రేటు తగ్గుతుందని ఇన్ఫోసిస్ అంచనా వేస్తోంది. ఉద్యోగులతో తరచూ మాట్లాడుతుండడం; శిక్షణ ఇవ్వడం, వేతన పెంపుల వంటివి ఇందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో వలసల నిరోధానికి ఉద్యోగులకు అధిక వేతనాలు, ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి వస్తున్నందున, కంపెనీల లాభదాయకతపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈఓ ఇలా వ్యాఖ్యానించారు. త్రైమాసికం వారీ వలసల రేటు విషయంలో ఇప్పటికే ఇన్ఫోసిస్ కొంత మెరుగవుతోందని పరేఖ్ గుర్తు చేశారు. ‘వార్షిక పద్ధతిలోనూ అది ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుంది. త్రైమాసికాలు గడిచే కొద్దీ వలసలు మరింత నియంత్రణలోకి వస్తాయ’ని సలీల్ పేర్కొన్నారు. మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2022 జూన్లో ఇన్ఫోసిస్ వలసల రేటు 27.7 శాతం నుంచి 28.4 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ‘ఉద్యోగులతో సంబంధాలను మరింత పెంచుకోవడంతో పాటు, పలు చర్యల వల్ల నియంత్రణ దిశగా, అంచనాలకు తగ్గట్లుగా, కరోనా ముందు స్థాయికి వలసల రేటును తీసుకెళ్లగలమన్న ధీమా తమకు ఉంద’ని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?