అరబిందో ఫార్మా లాభాల్లో క్షీణత
అరబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.6,236 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికరలాభం రూ.520.5 కోట్లు నమోదైంది. త్రైమాసిక ఈపీఎస్ రూ.8.88గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.5,702 కోట్లు, నికరలాభం రూ.770 కోట్లు ఉండటం గమనార్హం.
రూ.6,236 కోట్లకు ఆదాయం
ఈనాడు - హైదరాబాద్
అరబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.6,236 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికరలాభం రూ.520.5 కోట్లు నమోదైంది. త్రైమాసిక ఈపీఎస్ రూ.8.88గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.5,702 కోట్లు, నికరలాభం రూ.770 కోట్లు ఉండటం గమనార్హం. దీంతో పోల్చితే ప్రస్తుతం మొదటి త్రైమాసికంలో ఆదాయం 9.4 శాతం పెరిగినప్పటికీ, నికరలాభం 32.4 శాతం తగ్గింది.
ప్రస్తుత మొదటి త్రైమాసికంలో యూఎస్ ఫార్ములేషన్ల ఆదాయం 10.8 శాతం పెరిగింది. మరోపక్క ఐరోపా ఫార్ములేషన్ల ఆదాయం 2.2 శాతం తగ్గింది. యూరో (ఈయూ కరెన్సీ) మారకం విలువ క్షీణించటం దీనికి ఒక కారణంగా కంపెనీ పేర్కొంది. ఏఆర్వీ ఆదాయం 28.1 శాతం, ఏపీఐ ఆదాయం 11.6 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఈ మొదటి త్రైమాసికంలో పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు అరబిందో ఫార్మా రూ.310 కోట్లు వెచ్చించింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డిఏ) నుంచి 10 ఔషధాలకు ఏఎన్డీఏ (అబ్రీవియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్) అనుమతులు పొందినట్లు, ఇందులో 4 ఇంజెక్టబుల్ ఔషధాల ఉన్నాయని కంపెనీ తెలియజేసింది.
ప్రస్తుత ఫలితాలపై అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి స్పందిస్తూ, ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మెరుగైన పనితీరు కనబరచగలిగినట్లు పేర్కొన్నారు. కొత్త ఔషధాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు, వివిధ రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. స్పెషాలిటీ ఔషధాల శ్రేణిని పెంచుకోవటంపై దృష్టి సారించినట్లు, దీనివల్ల దీర్ఘకాలంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాలు బహుముఖంగా విస్తరిస్తాయని వివరించారు. అదే సమయంలో లాభదాయకతను పెంపొందించుకోవటానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.