జోయాలుక్కాస్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డులు

పసిడి ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌కు ప్రతిష్ఠాత్మక 17వ రిటైల్‌ జువెలర్‌ ఇండియా అవార్డ్స్‌ 2022లో పలు పురస్కారాలు లభించాయి. బెస్ట్‌ బ్రైడల్‌ డైమండ్‌ జువెలరీ ఆఫ్‌ ది ఇయర్‌, బెస్ట్‌ టీవీ క్యాంపైన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డులను జోయాలుక్కాస్‌ దక్కించుకుంది. 20 విభాగాల్లో 1000కు పైగా డిజైన్లకు గాను ఈ అవార్డులు

Published : 12 Aug 2022 03:13 IST

హైదరాబాద్‌: పసిడి ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌కు ప్రతిష్ఠాత్మక 17వ రిటైల్‌ జువెలర్‌ ఇండియా అవార్డ్స్‌ 2022లో పలు పురస్కారాలు లభించాయి. బెస్ట్‌ బ్రైడల్‌ డైమండ్‌ జువెలరీ ఆఫ్‌ ది ఇయర్‌, బెస్ట్‌ టీవీ క్యాంపైన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డులను జోయాలుక్కాస్‌ దక్కించుకుంది. 20 విభాగాల్లో 1000కు పైగా డిజైన్లకు గాను ఈ అవార్డులు పొందింది. 400కు పైగా ప్రత్యేకమైన డిజైన్‌లను పరిశీలించిన జ్యూరీ ఈ అవార్డులు ప్రకటించింది. ‘భారత ఆభరణాల విపణిలో పోటీని తట్టుకుని ఎల్లప్పుడూ అత్యుత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. విజేతలందరికీ శుభాకాంక్షలు’ అని జోయాలుక్కాస్‌ ఎండీ అలుక్కాస్‌ వర్గీస్‌ జాయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని