సంక్షిప్తంగా
అశోక్ లేలాండ్కు చెందిన స్విచ్ మొబిలిటీ దేశంలో 5,000 విద్యుత్ బస్సులను తీసుకురావడం కోసం రవాణా టెక్నాలజీ సంస్థ ఛలోతో జట్టు కట్టింది. ఈ భాగసామ్యం కింద ఈ రెండు కంపెనీలు కలిసి పెట్టుబడులు పెడతాయి.
* అశోక్ లేలాండ్కు చెందిన స్విచ్ మొబిలిటీ దేశంలో 5,000 విద్యుత్ బస్సులను తీసుకురావడం కోసం రవాణా టెక్నాలజీ సంస్థ ఛలోతో జట్టు కట్టింది. ఈ భాగసామ్యం కింద ఈ రెండు కంపెనీలు కలిసి పెట్టుబడులు పెడతాయి.
* ఆగస్టు 20 నుంచి దేశీయ విమాన మార్గాల్లో అదనంగా 24 సర్వీసులను నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ముంబయి- హైదరాబాద్, చెన్నై; దిల్లీ- ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయి- బెంగళూరు, అహ్మదాబాద్- పుణె మార్గాల్లో ఈ కొత్త సర్వీసులు ఉంటాయని పేర్కొంది.
* నిర్మాణం, జల విభాగంలో రూ.1,524 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకున్నట్లు జేఎంసీ ప్రాజెక్ట్స్ తెలిపింది.
* రాబోయే ఐదేళ్లలో రూ.4 లక్షల కోట్ల వ్యాపారాన్ని, రూ.4,000 కోట్ల వార్షిక లాభాన్ని నమోదు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్ ఎండీ, సీఈఓ బల్దేవ్ ప్రకాశ్ తెలిపారు.
* డాబర్ వేదిక్ గ్రీన్ టీ డిటాక్స్ కాహ్వాను విడుదల చేసినట్లు డాబర్ ఇండియా తెలిపింది. ఈ గ్రీన్ టీలో ఆయుర్వేదిక మూలికలు, రాతి ఉప్పు ఉన్నాయని పేర్కొంది.
* వడ్డీ రేట్లు పెంచడం వల్ల సమీపకాలంలో గృహాల గిరాకీపై ప్రభావం పడేందుకు దారి తీసే అవకాశం ఉందని డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ తెలిపారు.
* భారత్లో క్యూ3 కొత్త వెర్షన్కు ఆన్లైన్ బుకింగ్లు ప్రారంభించినట్లు ఆడి తెలిపింది. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. రూ.2 లక్షల ప్రారంభ మొత్తంతో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
* దిల్లీలోని అశోక్ విహార్లో కొత్త విలాసవంత గృహ సముదాయ ప్రాజెక్టును ప్రారంభించే యోచనలో ఉన్నామని గోద్రేజ్ ప్రోపర్టీస్ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.8,000 కోట్ల మేర విక్రయాల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
* స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులకు గడువు తేదీని ఆగస్టు 17కు పొడిగిస్తూ టెలికాం విభాగం(డాట్) నిర్ణయం తీసుకుంది. అంతక్రితం గడువు తేదీ ఆగస్టు 16గా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు