సంక్షిప్తంగా

అశోక్‌ లేలాండ్‌కు చెందిన స్విచ్‌ మొబిలిటీ దేశంలో 5,000 విద్యుత్‌ బస్సులను తీసుకురావడం కోసం రవాణా టెక్నాలజీ సంస్థ ఛలోతో జట్టు కట్టింది. ఈ భాగసామ్యం కింద ఈ రెండు కంపెనీలు కలిసి పెట్టుబడులు పెడతాయి.

Published : 12 Aug 2022 03:13 IST

* అశోక్‌ లేలాండ్‌కు చెందిన స్విచ్‌ మొబిలిటీ దేశంలో 5,000 విద్యుత్‌ బస్సులను తీసుకురావడం కోసం రవాణా టెక్నాలజీ సంస్థ ఛలోతో జట్టు కట్టింది. ఈ భాగసామ్యం కింద ఈ రెండు కంపెనీలు కలిసి పెట్టుబడులు పెడతాయి.

* ఆగస్టు 20 నుంచి దేశీయ విమాన మార్గాల్లో అదనంగా 24 సర్వీసులను నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ముంబయి- హైదరాబాద్‌, చెన్నై; దిల్లీ- ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్‌, ముంబయి- బెంగళూరు, అహ్మదాబాద్‌- పుణె మార్గాల్లో ఈ కొత్త సర్వీసులు ఉంటాయని పేర్కొంది.

* నిర్మాణం, జల విభాగంలో రూ.1,524 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకున్నట్లు జేఎంసీ ప్రాజెక్ట్స్‌ తెలిపింది.

* రాబోయే ఐదేళ్లలో రూ.4 లక్షల కోట్ల వ్యాపారాన్ని, రూ.4,000 కోట్ల వార్షిక లాభాన్ని నమోదు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బల్‌దేవ్‌ ప్రకాశ్‌ తెలిపారు.

* డాబర్‌ వేదిక్‌ గ్రీన్‌ టీ డిటాక్స్‌ కాహ్వాను విడుదల చేసినట్లు డాబర్‌ ఇండియా తెలిపింది. ఈ గ్రీన్‌ టీలో ఆయుర్వేదిక మూలికలు, రాతి ఉప్పు ఉన్నాయని పేర్కొంది.

* వడ్డీ రేట్లు పెంచడం వల్ల సమీపకాలంలో గృహాల గిరాకీపై ప్రభావం పడేందుకు దారి తీసే అవకాశం ఉందని డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు.

* భారత్‌లో క్యూ3 కొత్త వెర్షన్‌కు ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ప్రారంభించినట్లు ఆడి తెలిపింది. ప్రీమియం ప్లస్‌, టెక్నాలజీ వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. రూ.2 లక్షల ప్రారంభ మొత్తంతో ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు.

* దిల్లీలోని అశోక్‌ విహార్‌లో కొత్త విలాసవంత గృహ సముదాయ ప్రాజెక్టును ప్రారంభించే యోచనలో ఉన్నామని గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.8,000 కోట్ల మేర విక్రయాల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

* స్పెక్ట్రమ్‌ వేలం చెల్లింపులకు గడువు తేదీని ఆగస్టు 17కు పొడిగిస్తూ టెలికాం విభాగం(డాట్‌) నిర్ణయం తీసుకుంది. అంతక్రితం గడువు తేదీ ఆగస్టు 16గా పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని