చమురు, లోహ షేర్లు మెరిశాయ్
చమురు-గ్యాస్, లోహ, విద్యుత్ షేర్లు రాణించడంతో సూచీల లాభాలు కొనసాగాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఇందుకు మద్దతుగా నిలిచాయి.
సమీక్ష
చమురు-గ్యాస్, లోహ, విద్యుత్ షేర్లు రాణించడంతో సూచీల లాభాలు కొనసాగాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు ఇందుకు మద్దతుగా నిలిచాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 79.66 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 0.40 శాతం పెరిగి 100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, టోక్యో, సియోల్ లాభపడగా, షాంఘై నష్టపోయింది. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 59,235.98 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, 59,113.01 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. దిగువ స్థాయిల్లో కొనుగోళ్లతో కోలుకున్న సూచీ లాభాల్లోకి వచ్చి 59,538.08 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 130.18 పాయింట్ల లాభంతో 59,462.78 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 39.15 పాయింట్లు పెరిగి 17,698.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,597.85- 17,724.65 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 1074 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. ఎన్టీపీసీ 3.26%, టాటా స్టీల్ 3.25%, పవర్గ్రిడ్ 2.24%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.80%, రిలయన్స్ 1.64%, ఎస్బీఐ 1.16%, ఐటీసీ 0.69% చొప్పున మెరిశాయి. ఇన్ఫోసిస్ 1.56%, మారుతీ 1.35%, ఎల్ అండ్ టీ 1.25%, టెక్ మహీంద్రా 1.02%, నెస్లే 0.82% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. విద్యుత్, చమురు-గ్యాస్, లోహ, ఇంధన 2.47% వరకు పెరిగాయి. ఐటీ, ఆరోగ్య సంరక్షణ, వాహన మాత్రం డీలాపడ్డాయి.
* పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈఓగా విజయ్ శేఖర్ శర్మ పునర్నియామకానికి వ్యతిరేకంగా ఇన్వెస్టర్ సలహా సంస్థ ఐఐఏఎస్ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో పేటీఎం షేరు 4.65 శాతం తగ్గి రూ.787.15 వద్ద ముగిసింది.
* డాబర్ ఇండియా ఛైర్మన్ పదవికి అమిత్ బర్మన్ రాజీనామా చేశారు. కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన కొనసాగనున్నారు. ప్రస్తుతం నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా ఉన్న మోహిత్ బర్మన్ను అయిదేళ్ల పాటు బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా నియమించారు.
నేటి బోర్డు సమావేశాలు: ఫోర్స్ మోటార్స్ * ఎస్ఎమ్ఎస్ ఫార్మా * హిందుస్థాన్ కాపర్ * హనీవెల్ * జైన్ ఇరిగేషన్ * జేకే సిమెంట్ * కైటెక్స్ * రాజేశ్ ఎక్స్పోర్ట్స్ * జువారీ ఇండస్ట్రీస్
టాటా ఎలెక్సీ జీ రూ.10,000
ఏడాదిలో 133% రాణించిన షేరు
టాటా గ్రూప్ సంస్థ టాటా ఎలెక్సీ షేరు తొలిసారిగా రూ.10,000 మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 9 శాతం లాభపడ్డ షేరు.. రూ.10,398.40 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 7.85 శాతం లాభంతో రూ.10,241.45 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 26 శాతం రాణించిన షేరు, గత ఏడాదిలో ఏకంగా 133 శాతం దూసుకెళ్లింది. కంపెనీ జూన్ త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలతో పాటు బలమైన వృద్ధి అంచనాలను ప్రకటించడం సానుకూల ప్రభావం చూపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?