బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
ప్రపంచంలో లోహం రూపంలో బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా తర్వాత స్థానం మనదే. దేశీయంగా గనులు లేనందున, ఏటా దాదాపు 800-1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అయినా బంగారం ధర నిర్ణయించే పరిస్థితుల్లో మనదేశం లేదు. లండన్లోని బులియన్ ఎక్స్ఛేంజీ ధరలనే అనుసరించాల్సి
అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజీ వల్లే
బులియన్ వ్యాపారులకు ఖర్చులు, ఛార్జీలు తగ్గే అవకాశం
పారదర్శకత పెరుగుతుంది
ఈనాడు - హైదరాబాద్
ప్రపంచంలో లోహం రూపంలో బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా తర్వాత స్థానం మనదే. దేశీయంగా గనులు లేనందున, ఏటా దాదాపు 800-1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అయినా బంగారం ధర నిర్ణయించే పరిస్థితుల్లో మనదేశం లేదు. లండన్లోని బులియన్ ఎక్స్ఛేంజీ ధరలనే అనుసరించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఇటీవల ప్రారంభించిన ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజీ (ఐఐబీఎక్స్) వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను నిర్ణయించే శక్తిగా మనదేశం ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. చైనాలోని షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజీ, టర్కీలోని బొర్సా ఇస్తంబుల్, లండన్లోని ఎల్బీఎంఏ కోవలోకి ఈ ఎక్స్ఛేంజీ వస్తుంది.
ప్రస్తుతం బంగారం చేరుతోంది ఇలా
రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతించిన బ్యాంకులు, కొన్ని ఇతర సంస్థలు బిస్కెట్లు, కడ్డీల రూపంలో మేలిమి (999 స్వచ్ఛత-24 క్యారెట్ల) బంగారాన్ని దిగుమతి చేసుకుని, బులియన్ వ్యాపారులకు విక్రయిస్తున్నాయి. వీరి నుంచి పసిడి ఆభరణాల తయారీ/విక్రయదార్లు కొనుగోలు చేస్తారు. తదుపరి వినియోగదార్లకు చేరుతుంది. ఈ క్రమంలో అధిక ఛార్జీలు, రవాణా ఖర్చులు పడుతున్నాయి. అంతిమంగా ఈ భారాన్ని మోసేది వినియోగదార్లే. ఇక బంగారం క్రయవిక్రయాల్లో పారదర్శకత లేకపోవడం సరేసరి. కస్టమ్స్ క్లియరెన్సులకు అధిక సమయమూ పడుతోంది. ఈనెల 2 నుంచి బంగారం క్రయవిక్రయాలు జరుగుతున్న ఐఐబీఎక్స్ వల్ల కస్టమ్స్ ఆటంకాలు తగ్గడంతో పాటు, వ్యాపారులకూ వ్యయాలు తగ్గుతాయని చెబుతున్నారు.
అంతా ఎక్స్ఛేంజీ ద్వారానే
మనదేశం దిగుమతి చేసుకునే బంగారం మొత్తాన్ని ఈ ఎక్స్ఛేంజీ ద్వారానే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రూ.25 కోట్ల నికర విలువ గల జువెలరీ వర్తకులు, 5 లక్షల డాలర్ల నికర విలువ గల ప్రవాస భారతీయులు ఈ ఎక్స్ఛేంజీలో ఖాతా తెరిచి బంగారం కొనుగోళ్లు చేయవచ్చు. కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పనిసరిగా డెలివరీ తీసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్రయవిక్రయాలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం 6 - 8 గంటల మధ్య ‘డెలివరీ’లు ఉంటాయి. గిఫ్ట్ సిటీ లోనే వాల్ట్ (బంగారాన్ని నిల్వ చేసే) సేవల సంస్థలు ఏర్పాటయ్యాయి. బంగారాన్ని దిగుమతి చేసుకునే సంస్థలు, వాల్ట్లలో బంగారాన్ని నిల్వ చేసి, ఆమేరకు ‘గోల్డ్ రిసీట్’ను ఎక్స్ఛేంజీ ద్వారా విక్రయిస్తాయి. కొనుగోలు చేసిన వారికి అక్కడికక్కడే బంగారాన్ని డెలివరీ ఇస్తాయి. ఇదంతా పారదర్శకంగా జరిగిపోతుంది. కాబట్టి ప్రైస్ డిస్కవరీ (సరైన ధర నిర్ణయం)కి అవకాశం ఉంటుంది. గిఫ్ట్ సిటీలో వర్తకులపై ఎటువంటి స్థానిక పన్నుల భారం ఉండదు. అహ్మదాబాద్లో కస్టమ్స్ క్లియరెన్స్ లభించాక, 4 గంటల వ్యవధిలోనే బంగారాన్ని కొనుగోలుదార్లకు అందజేయొచ్చు. దేశంలోని ఇతర నగరాల్లోని కొనుగోలుదార్లకు 24 గంటల వ్యవధిలో డెలివరీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇప్పుడెలా జరుగుతోంది ?
ప్రస్తుతం బులియన్ వ్యాపారులు నెల రోజుల ముందే బ్యాంకులో బంగారాన్ని ‘బుక్’ చేసుకోవాలి. దేశీయ బ్యాంకులు లండన్లోని కోమెక్స్, లేదా న్యూయార్క్లో ఉన్న బంగారం ధరలను డాలర్ మారకపు విలువ ప్రకారం లెక్కించి, ఇక్కడి వర్తకుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నాయి. డెలివరీ వచ్చే సమయానికి గిరాకీ తగ్గినా, బుక్ చేసిన మొత్తాన్ని తీసుకోవలసిందే. బంగారం క్రయవిక్రయాలు ఒక చోట కాకుండా ఎక్కడెక్కడో జరుగుతూ ఉండటం, మధ్యవర్తుల ప్రమేయం అధికంగా ఉండటంతో దేశవ్యాప్తంగా బంగారానికి ఒకే ధర ఉండటం లేదు. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండదు. తాము ఎంత ధరకు బంగారాన్ని కొనుగోలు చేయదలిచారనేది నిర్ణయించుకుని, అదే ధరను బంగారం కొనుగోలుదార్లు ఐఐబీఎక్స్లో ‘కోట్’ చేయొచ్చు. తద్వారా ఇక్కడి గిరాకీకి అనుగుణంగా బంగారం ధరను మనదేశమూ ప్రభావితం చేసే వీలు కలుగుతుంది.
7 లక్షల కోట్ల డాలర్ల ఆభరణాల పరిశ్రమ
దేశీయంగా ఆభరణాల పరిశ్రమ ఏటా 7 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. ఇందులో 80- 90 శాతం మంది చిన్న, మధ్య తరహా వ్యాపారులే. ఐఐబీఎక్స్ వల్ల ఏటా బంగారం రవాణా ఛార్జీలు, ఇతర ఖర్చుల రూపంలో రూ.700- 800 కోట్ల వరకు మిగులుతుందని అంచనా వేస్తున్నారు. ఐఐబీఎక్స్లో ఇప్పటికే దాదాపు 70- 75 మంది బంగారం వర్తకులు ఖాతాలు తెరిచారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ నెల 2న ఎక్స్ఛేంజీలో 20 లాట్ల (1 లాట్= 1 కిలో) బంగారం విక్రయాలు నమోదయ్యాయి. ఈ నెల 10న 4 లాట్లు, ఈ నెల 12న 2 లాట్ల అమ్మకాలు జరిగాయి. సమీప భవిష్యత్తులో క్రయవిక్రయాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. మున్ముందు దక్షిణాసియా దేశాలు, మరికొన్ని ఇతర దేశాలు ఈ ఎక్స్ఛేంజీ ధరలను అనుసరించే అవకాశాలు లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
Realme Narzo 70 Pro 5G: రియల్మీ సంస్థ నార్జో 70 ప్రోను లాంచ్ చేసింది. దీని ధరను రూ.18,999గా నిర్ణయించింది. మార్చి 22 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
TCS: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఆన్సైట్, ఆఫ్సైట్ ఉద్యోగుల వేతనాలు పెంచనుంది. పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
Ashwini Vaishnaw: ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్ ఇండియా’ చిప్ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2026లోనే బుల్లెట్ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. -
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
Stock market: దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22వేల స్థాయిని కోల్పోయింది. -
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. -
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో