ఎయిర్టెల్ ఎండీ, సీఈఓగా గోపాల్ విఠల్ పునర్నియామకం
భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), సీఈఓగా గోపాల్ విఠల్ పునర్నియామక ప్రతిపాదనకు కంపెనీ వాటాదార్లు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి అయిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పునర్నియామక ప్రతిపాదనకు 97 శాతం మంది అనుకూలంగా ఓటేశారని వార్షిక సాధారణ సమావేశం వివరాలను ఎక్స్ఛేంజీలకు
వాటాదార్ల ఆమోదం
దిల్లీ: భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), సీఈఓగా గోపాల్ విఠల్ పునర్నియామక ప్రతిపాదనకు కంపెనీ వాటాదార్లు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి అయిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పునర్నియామక ప్రతిపాదనకు 97 శాతం మంది అనుకూలంగా ఓటేశారని వార్షిక సాధారణ సమావేశం వివరాలను ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తూ ఎయిర్టెల్ తెలిపింది. ఎండీ, సీఈఓగా గోపాల్ విఠల్కు చెల్లించే పారితోషికానికి సంబంధించిన ప్రత్యేక ప్రతిపాదనకూ వాటాదార్లు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రతిపాదనకు 89.57 శాతం మంది అనుకూలంగా, 10.42 శాతం మంది వ్యతిరేకంగా ఓటేశారని పేర్కొంది. 2018 ఫిబ్రవరి 1న గోపాల్ విఠల్ను ఎండీ, సీఈఓగా అయిదేళ్ల కాలానికి కంపెనీ పునర్నియమించింది. తాజాగా ఆ సమయాన్ని మరో ఐదేళ్లు పొడిగించడంతో.. 2028 జనవరి 31 వరకు ఆయన ఈ పదవుల్లో కొనసాగనున్నారు. అలాగే వార్షికంగా రూ.9.6 కోట్ల స్థిర వేతనాన్ని పారితోషికంగా చెల్లించేందుకు ప్రతిపాదించారని ఏజీఎం అజెండాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన వేరియబుల్ పే (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు) కింద వార్షికంగా రూ.6.2 కోట్లు చెల్లించాలనీ అందులో ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వార్షిక స్థిర వేతనంలో 90 శాతానికి వేరియబుల్ పే మించకూడదని పేర్కొంది. 2021-22లో విఠల్కు స్థిర వేతనం రూ.9.1 కోట్లుగా ఉంది. ఇది కాకుండా వేరియబుల్ పే అదనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!