ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓకు మరోసారి దరఖాస్తు
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద మరోసారి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకు ఏడాది కిందటే సెబీ అనుమతి మంజూరు చేయగా, అది గత నెలలో
దిల్లీ: ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద మరోసారి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకు ఏడాది కిందటే సెబీ అనుమతి మంజూరు చేయగా, అది గత నెలలో ముగిసింది. దీంతో మరోసారి ముసాయిదా పత్రాలు దాఖలు చేయాల్సి వచ్చింది. సెబీ నియమావళి ప్రకారం, ఒక సంస్థ ఐపీఓకు సెబీ అనుమతి లభించిన ఏడాదిలోపు పబ్లిక్ ఇష్యూకు రావాల్సి ఉంటుంది. లేదంటే మరోసారి ముసాయిదా పత్రాలు దాఖలు చేయాలి. తాజాగా సమర్పించిన పత్రాల ప్రకారం, ఫిన్కేర్ ఐపీఓలో రూ.625 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్లు, పెట్టుబడిదార్లకు చెందిన 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ప్రమోటర్ ఫిన్కేర్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్తో పాటు వాగ్నర్, ట్రూ నార్త్ ఫండ్ వీ ఎల్ఎల్పీ, ఇండియమ్ ఐవీ (మారిషస్) హోల్డింగ్స్ లిమిటెడ్, ఒమేగా టీసీ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్, లీఫ్ఫ్రాగ్ రూరల్ ఇన్క్లూజన్ (ఇండియా) లిమిటెడ్ తదితర పెట్టుబడి సంస్థలు ఓఎఫ్ఎస్లో షేర్లను విక్రయించనున్నాయి. కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎడెల్వైజ్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సిల్వర్ లీఫ్ ఓక్ (మారిషస్) లిమిటెడ్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఎడెల్వైజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఓఎఫ్ఎస్లో పాల్గొంటున్నాయి.
* ఎలక్ట్రానిక్ తయారీ సేవల సంస్థ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ రూ.840 కోట్ల ఐపీఓ ఈ నెల 18న ముగియనుంది. ఈ పబ్లిక్ ఇష్యూకు రూ209-220ని ధరల శ్రేణిగా నిర్ణయించింది. మే 24-26 మధ్య వచ్చిన ఏథెర్ ఇండస్ట్రీస్ ఐపీఓ తర్వాత మళ్లీ పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న సంస్థ ఇదే. తాజా షేర్ల జారీ ద్వారా రూ.766 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో వీనా కుమారి టాండన్ 33.69 లక్షల షేర్లను విక్రయించడం ద్వారా మిగతా నిధుల్ని కంపెనీ సమీకరించనుంది. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లు ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
* వార్బర్గ పింకస్, ఫేరింగ్ క్యాపిటల్ పెట్టుబడులున్న సంప్రదాయ దుస్తుల సంస్థ బిబా ఫ్యాషన్ ఐపీఓను సెబీ నిలుపుదల చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.90 కోట్లు, ఓఎఫ్ఎస్ ద్వారా 2.77 కోట్ల ప్రమోటర్, వాటాదార్ల షేర్లను విక్రయించి మిగతా నిధుల్ని సమీకరించేందుకు బిబా ఫ్యాషన్ ఏప్రిల్ 12న సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. కారణాన్ని వెల్లడించకుండా బిబా ఫ్యాషన్ ఐపీఓను నిలుపుదల చేయాలని సెబీ తమ వెబ్సైట్లో ఉంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు