పసిడి, రాగి ఆకర్షణీయమే!
పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం కొంత సానుకూలంగానే కన్పిస్తోంది. అయితే రూ.52,041 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి కంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరింతగా పడిపోవచ్చు. రూ.52,596 పైన కదలాడితే రాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.52,075 వద్ద స్టాప్లాస్ పెట్టుకుని, రూ.52,596 ఎగువన లాంగ్ పొజిషన్లు
కమొడిటీస్ ఈ వారం
బంగారం
పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం కొంత సానుకూలంగానే కన్పిస్తోంది. అయితే రూ.52,041 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి కంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరింతగా పడిపోవచ్చు. రూ.52,596 పైన కదలాడితే రాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూ.52,075 వద్ద స్టాప్లాస్ పెట్టుకుని, రూ.52,596 ఎగువన లాంగ్ పొజిషన్లు కొనసాగించడం మంచిదే.
* ఎంసీఎక్స్ బులియన్ ఇండెక్స్ ఆగస్టు కాంట్రాక్టు రూ.14,588 కంటే పైన చలిస్తే రూ.14,686; రూ.14,795 వరకు రాణించవచ్చు.
వెండి
వెండి సెప్టెంబరు కాంట్రాక్టు కిందకు వస్తే రూ.57,933 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.56,567కి దిగి రావచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.60,042 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనినీ అధిగమిస్తే రూ.60,785 వరకు పెరగొచ్చు.
ప్రాథమిక లోహాలు
* రాగి ఆగస్టు కాంట్రాక్టు రూ.681 కంటే పైన కదలాడితే సానుకూలతకు అవకాశం ఉంటుంది. రూ.664 వద్ద స్టాప్లాస్ను పరిగణిస్తూ, రూ.671 కంటే పైన లాంగ్ పొజిషన్లకు మొగ్గు చూపడం మంచిదే.
* సీసం ఆగస్టు కాంట్రాక్టు రూ.182 కంటే దిగువన చలిస్తే మరింతగా పడిపోవచ్చు. అయితే సానుకూల ధోరణి కొనసాగేందుకూ ఆస్కారం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ట్రేడ్ చేయాలి.
* జింక్ ఆగస్టు కాంట్రాక్టు రూ.318 కంటే పైన కదలాడితే.. కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు. రూ.313ను స్టాప్లాస్గా పరిగణించాలి.
* అల్యూమినియం ఆగస్టు కాంట్రాక్టు రూ.217.75 కంటే పైన కదలాడకుంటే.. కొంత అమ్మకాల ఒత్తిడికి లోనవ్వచ్చు.
ఇంధన రంగం
* ముడి చమురు సెప్టెంబరు కాంట్రాక్టు రూ.7,009 కంటే దిగువన కదలాడకుంటే కొనుగోళ్లు చోటుచేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువన చలిస్తే రూ.6,688; రూ.6,564 వరకు దిద్దుబాటు కావచ్చు.
* సహజవాయువు ఆగస్టు కాంట్రాక్టు రూ.608 కంటే ఎగువన కదలాడకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పైకి వెళితే రూ.636.50 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.756 వరకు పెరగొచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు సెప్టెంబరు కాంట్రాక్టు రూ.7,111 కంటే దిగువన కదలాడకుంటే.. గతవారం గరిష్ఠమైన రూ.7,746 వరకు పెరగొచ్చు.
* జీలకర్ర సెప్టెంబరు కాంట్రాక్టు రూ.24,996 కంటే పైన కదలాడితే మరింతగా పెరగొచ్చు. అందువల్ల ఈ స్థాయికి దిగువన షార్ట్ సెల్లింగ్కు దూరంగా ఉండటమే మంచిది.
* ధనియాలు సెప్టెంబరు కాంట్రాక్టు రూ.11,382 కంటే దిగువన చలిస్తే, మరింతగా దిద్దుబాటు కావచ్చు.
- ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..