గంగవరం పోర్టులో కొత్తగా కంటెయినర్ టెర్మినల్
ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్టులో నూతన ‘కంటెయినర్ టెర్మినల్’ ప్రారంభం కానుంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభించేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజడ్) సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల తూర్పు తీరంలో సరకు రవాణా సౌకర్యాలు విస్తరిస్తాయని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,
వచ్చే నెలలో ప్రారంభం
తూర్పు తీరం నుంచి సరకు రవాణా పెరుగుతుంది
అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ ఆశాభావం
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్టులో నూతన ‘కంటెయినర్ టెర్మినల్’ ప్రారంభం కానుంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభించేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజడ్) సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల తూర్పు తీరంలో సరకు రవాణా సౌకర్యాలు విస్తరిస్తాయని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, ఒడిశా, జార్ఘండ్ రాష్ట్రాల నుంచి సరకు రవాణా పెరుగుతుందని ఏపీఎస్ఈజడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మనదేశం నుంచి సరకు రవాణా పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాల నుంచి అధికంగా నమోదవుతోంది. మొత్తం సరకు రవాణాలో పశ్చిమ తీరంలోని నౌకాశ్రయాల వాటా 61% ఉండగా, తూర్పు తీరం నుంచి 39% ఉంటుంది. గతేడాది కాలంలో పశ్చిమ తీరం నుంచి 9% అధికంగా సరకు రవాణా జరిగింది. తూర్పు తీరం నుంచి 6% వృద్ధే నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జరిగిన సరకు రవాణాలో 55% ‘డ్రై కార్గో’ కాగా, 35% కంటెయినర్ కార్గో ఉంది. దాదాపు 10% ముడి చమురు, సహజ వాయువు రవాణా ఉంది. అదానీ పోర్ట్స్ ఈ మొదటి త్రైమాసికంలో 31.5 మిలియన్ టన్నుల కంటెయినర్ కార్గో నిర్వహించింది. గంగవరం పోర్టులో నూతన కంటెయినర్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఇంకా అధికంగా కంటెయినర్ కార్గోను నమోదు చేసే వీలుంటుంది. ఇటీవల దేశీయంగా బొగ్గు వినియోగం పెరిగింది. దీనివల్ల బొగ్గు ధరా పెరిగింది. బొగ్గు కొరతా ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు రవాణాకు అవకాశాలు పెరిగాయి. దీంతో పాటు స్టీలు ప్లాంట్లు కోకింగ్ కోల్ను అధికంగా వినియోగిస్తున్నాయి. అందువల్ల బొగ్గు, కోకింగ్ కోల్ రవాణాలో అందివస్తున్న కొత్త అవకాశాలపై కంపెనీ అదానీ పోర్ట్స్ సారించింది. గంగవరం, కృష్ణపట్నం నౌకాశ్రయాలతో పాటు ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి సమీప భవిష్యత్తులో బొగ్గు, కోకింగ్ కోల్ రవాణా పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
తూర్పు తీరంలోని దక్షిణ ప్రాంతంలో కృష్ణపట్నం, కట్టుపల్లి, ఎన్నూర్ పోర్టులను అదానీ పోర్ట్స్ నిర్వహిస్తోంది. ఈ పోర్టుల్లో కంటెయినర్ కార్గో ఇటీవల తగ్గిన నేపథ్యంలో కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి ‘ఫీడర్ సర్వీసు’లను పెంపొందించే దిశగా కసరత్తు చేపట్టింది. దీనివల్ల బంగ్లాదేశ్, మయన్మార్కు సరకు రవాణాకు సంబంధించి కృష్ణపట్నం ‘ట్రాన్స్షిప్మెంట్ హబ్’గా మారుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మూడో త్రైమాసికం నుంచి మార్పు కనిపిస్తుందని, కృష్ణపట్నం నౌకాశ్రయం నుంచి కంటెయినర్ కార్గో కార్యకలాపాలు పెరుగుతాయని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అదానీ లాజిస్టిక్స్ చేతికిఐసీడీ టంబ్
నవకర్ కార్పొరేషన్ నుంచి ఐసీడీ టంబ్ను అదానీ లాజిస్టిక్స్ రూ.835 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కింద 0.5 మిలియన్ టీఈయూలు (ఇరవై అడుగుల సమాన యూనిట్) సామర్థ్యం గల ఐసీడీని అదానీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే ఈ డీఎఫ్సీ (ప్రత్యేక రవాణా నడవా)లతో పాటు అదనంగా పారిశ్రామిక నడవా (ఇండస్ట్రియల్ కారిడార్), లాజిస్టిక్ పార్క్లు కూడా వస్తుండడంతో.. సంస్థకున్న 129 ఎకరాల భూమి కారణంగా భవిష్యత్లో అదనపు విస్తరణకు వీలు కలుగుతుందని కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.