స్పైస్జెట్, మారన్ల వివాదానికి మధ్యవర్తిత్వం
స్పైస్జెట్కు, కళానిధి మారన్, ఆయనకు చెందిన కాల్ ఎయిర్వేస్కు మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదాలను పరిష్కరించడం కోసం మధ్యవర్తిత్వానికి వెళతామన్న సంయుక్త విజ్ఞప్తిని పరిశీలించగలమని సుప్రీం కోర్టు పేర్కొంది. స్పైస్జెట్కు, మారన్కు మధ్య మూడు వివాదాలుండగా.. అందులో ఒకటి
విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న సుప్రీం
దిల్లీ: స్పైస్జెట్కు, కళానిధి మారన్, ఆయనకు చెందిన కాల్ ఎయిర్వేస్కు మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న వివాదాలను పరిష్కరించడం కోసం మధ్యవర్తిత్వానికి వెళతామన్న సంయుక్త విజ్ఞప్తిని పరిశీలించగలమని సుప్రీం కోర్టు పేర్కొంది. స్పైస్జెట్కు, మారన్కు మధ్య మూడు వివాదాలుండగా.. అందులో ఒకటి జులై 29న పరిష్కారమైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనానికి స్పైస్జెట్ తరఫు వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి తెలియజేశారు. అన్ని వివాదాల పరిష్కారానికి 4-6 వారాల సమయం కావాలని రోహత్గి తొలుత విన్నవించారు. అయితే హైదరాబాద్ మధ్యవర్తిత్వ కేంద్రంలో ఇరు పార్టీలు సమస్యల పరిష్కారానికి వెళితే మంచిదని మారన్, కాల్ ఎయిర్వేస్ తరఫు సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సలహానిచ్చారు. ఇందుకు స్పైస్జెట్ కూడా మద్దతు పలికింది. దీంతో ‘మేం పరిశీలిస్తామ’ని ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. స్పైస్జెట్, దాని మాజీ ప్రమోటరు మారన్, కాల్ ఎయిర్వేస్ల మధ్య షేర్ల బదిలీ వివాదం ఎప్పటి నుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే.
విమానలీజుదారుతో స్పైస్జెట్ సెటిల్మెంట్: రెండు బోయింగ్ 737 మాక్స్ విమానాలు, ఒక బోయింగ్ 737-800 ఎన్జీ విమానానికి సంబంధించి విమానాల లీజుదారు గోషాక్ ఏవియేషన్, దీనికి చెందిన రెండు అనుబంధ కంపెనీలతో స్పైస్జెట్ వివాద పరిష్కారాన్ని కుదుర్చుకుంది. ‘డీ హావిలాండ్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ కెనడా, క్రెడిట్ సూయిజ్, బోయింగ్, సీడీబీ ఏవియేషన్, బీఓసీ ఏవియేషన్, అవలాన్లతో విజయవంతంగా సెటిల్మెంట్లు కుదుర్చుకున్న అనంతరం గోషాక్తోనూ సెటిల్మెంట్ చేసుకున్న’ట్లు ఒక ప్రకటనలో స్పైస్జెట్ తెలిపింది. మూడు విమానాలకు సంబంధించిన లీజు ఒప్పందాల విషయంలో బ్రిటన్ కోర్టు, దిల్లీ హైకోర్టుకు దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను వెనక్కి తీసుకుంటామనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి