సీఎండీ, సీఈఓలకు సమన్లు వద్దు
కంపెనీల్లో ఉన్నత హోదాల్లోని ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారులకు (సీఈఓ) సమన్లు జారీ చేసి, అరెస్టు చేయించడాన్ని క్షేత్ర స్థాయి జీఎస్టీ అధికారులు యాంత్రికంగా
క్షేత్ర స్థాయి అధికారులకు జీఎస్టీ దర్యాప్తు విభాగం మార్గదర్శకాలు
దిల్లీ: కంపెనీల్లో ఉన్నత హోదాల్లోని ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారులకు (సీఈఓ) సమన్లు జారీ చేసి, అరెస్టు చేయించడాన్ని క్షేత్ర స్థాయి జీఎస్టీ అధికారులు యాంత్రికంగా చేపట్టవద్దని జీఎస్టీ దర్యాప్తు విభాగం స్పష్టం చేసింది. జీఎస్టీ చట్టం కింద సమన్ల జారీ, అరెస్టు, బెయిల్కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డులోని (సీబీఐసీ) దర్యాప్తు విభాగం గురువారం జారీ చేసింది. ‘అరెస్టు కారణంగా ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తుంది. విశ్వసనీయత ఆధారంగానే ఈ తరహా చర్యలు ఉండాలి మినహా, యాంత్రిక పద్ధతిలో కాద’ని సీబీఐసీ స్పష్టం చేసింది. జీఎస్టీ నేర ఆరోపణలున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు అధికారులు పరిశీలించాల్సిన జాబితాను (చెక్ లిస్ట్) కూడా ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందా? సాక్షులను భయపెడతాడా ? పాల్పడిన నేరంలో ఆ వ్యక్తి గొప్ప నేర్పరా? లాంటివి పరిశీలించాలంది. ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు చట్టపరమైన అంశాలతో పాటు సమగ్ర దర్యాప్తు నిర్వహించడం, సాక్ష్యాల తారుమారు లేదా సాక్షులకు బెదిరింపులు, ప్రభావితం చేయడాన్ని నియంత్రించడం లాంటి వాటిపైనా దష్టి పెట్టాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ‘ఆదాయ నష్టానికి దారి తీసిన నిర్ణయ ప్రక్రియలో వారి పాత్ర ఉందని దర్యాప్తులో స్పష్టమైన సంకేతాలుంటే సమన్లు జారీ చేయొచ్చ’ని పేర్కొన్నాయి. ప్రాథమిక సాక్ష్యాలు, దస్త్రాల కోసం కంపెనీల ఉన్నతాధికారులకు, జీఎస్టీ క్షేత్ర స్థాయి అధికారులు సమన్లు జారీ చేస్తున్నట్లు గుర్తించినట్లు జీఎస్టీ దర్యాప్తు విభాగం వెల్లడించింది. జీఎస్టీ పోర్టల్లో లభించే జీఎస్టీఆర్-3బీ, జీఎస్టీఆర్-1 లాంటి చట్టబద్దమైన దస్త్రాల కోసం కూడా ఈ సమన్లను జారీ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి వాటి కోసం సమన్లను జారీ చేయకూడదని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..