వలసలు అధికంగానే ఉంటాయ్
‘అధిక వేతనం పొందడంతో పాటు, వృత్తి జీవితంలో పైకెదగాలనే ఆకాంక్ష, సౌకర్యవంతమైన పని పద్ధతులు కావాలనే ధోరణి 26 - 41 ఏళ్ల (మిలీనియల్స్) ఉద్యోగుల్లో అధికంగా ఉంది.
అధిక వేతనం, పదోన్నతులే యువత లక్ష్యం
పీడబ్ల్యూసీ ఇండియా సర్వే
దిల్లీ: ‘అధిక వేతనం పొందడంతో పాటు, వృత్తి జీవితంలో పైకెదగాలనే ఆకాంక్ష, సౌకర్యవంతమైన పని పద్ధతులు కావాలనే ధోరణి 26 - 41 ఏళ్ల (మిలీనియల్స్) ఉద్యోగుల్లో అధికంగా ఉంది. రాబోయే ఏడాది కాలంలో వేరే సంస్థకు మారాలనుకుంటున్నామని దేశంలో 34 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సిబ్బంది వలసలు అధికంగానే ఉండనున్నాయి. కొవిడ్ తీవ్రత సర్దుమణిగినా, కార్యాలయాలకు వచ్చేందుకూ సుముఖత చూపడం లేదు. ఇంటి నుంచి / హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకే ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు’ అని పీడబ్ల్యూసీ ఇండియా సర్వే పేర్కొంది. ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలున్న వారి కొరతా, వలసలకు కారణమని విశ్లేషించింది. దేశంలో 2,688 మంది నుంచి అభిప్రాయాలు సేకరించామని, వీరిలో 93 శాతం మంది పూర్తికాల ఉద్యోగులని సంస్థ పేర్కొంది. ఈ ప్రకారం.నీ వేరే సంస్థకు మారదామనుకుంటున్నామని మన దేశంలో మొత్తంమీద 34 శాతం (మిలీనియల్స్లో 37 శాతం) మంది తెలిపారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 19 శాతంగానే ఉంది.
* ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలే యోచనలో 32 శాతం మంది ఉన్నారు. వీళ్లు వేరే కంపెనీకి మారాలని అనుకోవడం వెనక ఇప్పుడు చేస్తున్న కంపెనీ నచ్చట్లేదన్నదే కారణమై ఉండకపోవచ్చు. పైగా ఈ అభిప్రాయం ఉన్న యువతలో 50 శాతం మంది, తాము పనిచేస్తున్న సంస్థ భద్రమైనదని ఇతరులకు సూచిస్తున్నారు కూడా.
*ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడంపై దృష్టి పెట్టలేకపోయామని దేశీయంగా 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమ విధులను ఇంటి నుంచి అయినా చేయొచ్చని 81 శాతం మంది పేర్కొన్నారు.
* 18-25 ఏళ్ల (జనరేషన్ జెడ్) ఉద్యోగుల్లో కంపెనీ మారేందుకు ఆసక్తి చూపుతున్న వాళ్లు తక్కువే. అయితే వీళ్లలో మూడింట ఒక వంతు మంది పని గంటలు తగ్గించాలని కోరుకుంటున్నారు.
*సహోద్యోగుల నుంచి సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశాలు లేకపోవడంపై సగం మందికి పైగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత హోదా స్థాయిల్లోనే (సీఈఓలు) శిక్షణకు సంబంధించి తారతమ్యాలు ఎక్కువగా ఉన్నాయి.
*పని ప్రాంతాల్లో జరిగే చర్చల్లో సున్నిత అంశాలైన సామాజిక, రాజకీయ విషయాలపైనే 75 శాతం మంది మాట్లాడుకుంటున్నారు. ఈ తరహా చర్చలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉద్యోగ సంస్థలపై ఉంది.
*సామాజిక, పర్యావరణ, ఆర్థిక, భౌగోళిక, రాజకీయంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి కంపెనీలకు ఏర్పడిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్, లీడర్ చైటాలి ముఖర్జీ తెలిపారు. సంస్థల కోసం, తమ సిబ్బంది కోసం స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించే ముందు ఈ మార్పులను కంపెనీల అధిపతులు దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!