2 నుంచి శామ్‌సంగ్‌ ఫోల్డబుల్‌ ఫోన్ల విక్రయాలు

అత్యంత ఖరీదైన 5జీ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 4, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 4లను సెప్టెంబరు 2 నుంచి దేశీయంగా విక్రయిస్తామని శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వెల్లడించింది. ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి ఈ నెల 27 నుంచే ఫోన్లను డెలివరీ చేస్తామని కంపెనీ

Published : 19 Aug 2022 07:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: అత్యంత ఖరీదైన 5జీ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 4, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 4లను సెప్టెంబరు 2 నుంచి దేశీయంగా విక్రయిస్తామని శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వెల్లడించింది. ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి ఈ నెల 27 నుంచే ఫోన్లను డెలివరీ చేస్తామని కంపెనీ ప్రోడక్ట్‌ మార్కెటింగ్‌ అధిపతి ఆదిత్య బబ్బర్‌ గురువారం ఇక్కడ తెలిపారు. ఫోల్డ్‌4 ధరల శ్రేణి రూ.1,54,999 నుంచి రూ.1,84,999 కాగా,  ఫ్లిప్‌4 ధరల శ్రేణి రూ.89,999 నుంచి రూ.97,999 మధ్య ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్లను దిగుమతి చేసుకుని, విక్రయిస్తున్నామని.. దేశీయంగానూ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని