UPI: బ్రిటన్కెళ్లినా.. యూపీఐ వాడొచ్చు
భారత్ తను సొంతంగా తయారు చేసుకున్న రియల్టైం చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐని తాజాగా బ్రిటన్లో ప్రవేశపెట్టింది. ఇందు కోసం పేఎక్స్పర్ట్తో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్(ఎన్ఐపీఎల్) ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
భారత్ వెలుపలా సేవల ప్రారంభం
దిల్లీ: భారత్ తను సొంతంగా తయారు చేసుకున్న రియల్టైం చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐని తాజాగా బ్రిటన్లో ప్రవేశపెట్టింది. ఇందు కోసం పేఎక్స్పర్ట్తో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్(ఎన్ఐపీఎల్) ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థే ఎన్ఐపీఎల్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)తో పాటు రుపే కార్డు పథకాన్ని ఎన్పీసీఐయే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. బ్రిటన్లో పేఎక్స్పర్ట్స్కు చెందిన ఆండ్రాయిడ్ పాయింట్-ఆఫ్-సేల్(పీఓఎస్) పరికరాల్లో ఇన్-స్టోర్ చెల్లింపులు చేసేందుకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మొదట క్యూఆర్ కోడ్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. తర్వాత రుపే కార్డు చెల్లింపులకున్న అవకాశాన్నీ పరిశీలించనున్నామ’ని ఎన్పీసీఐ గురువారం తెలిపింది.
ఎవరికి ప్రయోజనం అంటే..: మన దేశం నుంచి బ్రిటన్కు ఏటా వెళ్లే 5 లక్షల మంది సులువగా చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపకరించనుంది. ఇందులో లక్ష మందికి పైగా విద్యార్థులే ఉంటారు. బ్రిటన్లోని వినియోగదార్లు, రిటైలర్లకూ ఇది ప్రయోజనం కలిగిస్తుందని.. రిటైల్, ఆతిథ్య, పర్యటక రంగాలకు ఊతమిస్తుందని ఎన్పీసీఐ పేర్కొంది.
ఏ దేశాల్లో యూపీఐ పనిచేస్తుందంటే..: 2021 జులైలో భూటన్లోనూ యూపీఐ సేవలు మొదలయ్యాయి. రుపే కార్డులను అనుమతించే ఏకైక దేశం ఇదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేపాల్లోనూ యూపీఐ అడుగుపెట్టింది. ఇపుడు బ్రిటన్లోకీ వెళ్లింది.
స్విచ్ నుంచి విద్యుత్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు
ఒకసారి ఛార్జింగ్తో 250 కి.మీ. వరకు ప్రయాణం
ముంబయి: అశోక్ లేలాండ్ విద్యుత్ విభాగమైన స్విచ్ మొబిలిటీ దేశీయంగా విద్యుత్తుతో నడిచే తొలి డబుల్ డెక్కర్ ఏసీ బస్సును ఆవిష్కరించింది. ఈఐవీ 22 పేరుతో దీన్ని ముంబయిలో గురువారం విడుదల చేసింది. 231 కిలోవాట్ అవర్ సామర్థ్యం కలిగిన ఈ బస్సు డ్యూయల్ గన్ ఛార్జింగ్ సిస్టమ్తో వస్తోంది. ఒకసారి ఛార్జింగ్తో 250 కి.మీ. వరకు ప్రయాణించొచ్చని సంస్థ తెలిపింది.
ఇప్పటికే బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) 200 బస్సుల కోసం ఆర్డర్ చేసిందని స్విచ్ మొబిలిటీ ఇండియా సీఓఓ మహేశ్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం ముంబయిలో తిరుగుతున్న డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో వీటిని ప్రవేశ పెడతారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 50 బస్సులను డెలివరీ చేయనున్నామని చెప్పారు. మిగతా నగరాల నుంచీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని, వచ్చే ఏడాదికల్లా 150-200 బస్సులను డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. ముంబయిలో 1967లోనే తొలి డబుల్ డెక్కర్ బస్సును అశోక్ లేలాండ్ ప్రవేశపెట్టింది. ఆ వారసత్వాన్ని స్విచ్ మొబిలిటీ కొనసాగించనుందని కంపెనీ పేర్కొంది.
* భారత్, యూకేల్లో విద్యుత్ బస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాల అభివృద్ధికి 300 మిలియన్ పౌండ్లు పెట్టుబడి పెడుతున్నట్లు స్విచ్ మొబిలిటీ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించింది. ఇప్పటికే డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు 100 వరకు యూకే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా