జులైలో కోటిలోపే విమాన ప్రయాణికులు
జులైలో దేశీయంగా 97 లక్షలకు పైగా మంది విమానాల్లో ప్రయాణించారు. జూన్లో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.6 శాతం తక్కువని విమానయాన నియంత్రణాధికార సంస్థ డీజీసీఏ పేర్కొంది.
మార్కెట్ వాటాలో విస్తారాకు రెండోస్థానం
దిల్లీ: జులైలో దేశీయంగా 97 లక్షలకు పైగా మంది విమానాల్లో ప్రయాణించారు. జూన్లో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.6 శాతం తక్కువని విమానయాన నియంత్రణాధికార సంస్థ డీజీసీఏ పేర్కొంది. టాటా, సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్త సంస్థ అయిన విస్తారా తొలిసారిగా, దేశీయ విమానయాన విపణిలో రెండోస్థానానికి చేరింది. ఇండిగో తరవాత అత్యధిక ప్రయాణికులను చేరవేసిన సంస్థగా నిలిచింది. 2022 జనవరి-జులైలో మొత్తం 6.69 కోట్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారని తన నెలవారీ నివేదికలో డీజీసీఏ పేర్కొంది. వర్షాకాలంలో దేశీయంగా విమాన ప్రయాణాలు తక్కువగా జరుగుతుంటాయి. నాలుగు మెట్రో విమానాశ్రయాల్లో (బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, ముంబయి) ఎయిరేషియా ఇండియా 95.5 శాతం మేర అత్యుత్తమ సమయపాలనను పాటించింది. విస్తారా, గోఫస్ట్లు వరుసగా 89%, 84.1 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
-----------
విమానయాన సంస్థ ప్రయాణికులు(లక్షల్లో) సీట్ల భర్తీ (శాతం)
ఇండిగో 57.11 77.7
విస్తారా 10.13 84.3
ఎయిరిండియా 8.14 71.1
గోఫస్ట్ 7.95 76.5
స్పైస్జెట్ 7.76 84.7
ఎయిరేషియా ఇండియా 4.42 75.2
అలయన్స్ ఎయిర్ 1.12 -----
ప్రవాస కంపెనీలకు ఊరట
5% టీసీఎస్ మినహాయింపు
ఐటీ నిబంధనల్లో మార్పుల నోటిఫై
దిల్లీ: భారత్లో ఒక స్థిర వ్యాపారం లేదా శాశ్వత ఏర్పాటు(పీఈ) లేని ప్రవాస కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్ను విభాగం ఊరట కలిగించింది. మూలం వద్ద వసూలు చేసే పన్ను(టీసీఎస్) నుంచి వీటికి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నోటిఫై చేసింది. ఐటీ చట్టం సెక్షన్ 206(1జీ) కింద మినహాయింపు పరిధిని (అంతక్రితం కేవలం ప్రవాస వ్యక్తులకే ఈ మినహాయింపు ఉండేది) పెంచింది.
ఎంత ఉండేదంటే..: భారత్లోని వ్యక్తులు చేసే విదేశీ మారకపు వ్యయాలపై ఓ కన్నేయడం కోసం ఆర్థిక చట్టం-2020 ద్వారా సెక్షన్ 206సీ(1జీ)ని ప్రవేశపెట్టారు. 2020 అక్టోబరు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. రూ.7 లక్షలు అంత కంటే ఎక్కువ విదేశీ మారకపు వ్యయాలపై మూలం వద్ద 5 శాతం పన్ను వసూలు చేసేవారు. భారత్ను సందర్శించే ప్రవాస భారతీయుల నుంచి దేశీయ టూర్ ఆపరేటర్లు పొందే నగదుపై ఈ టీసీఎస్ను విధించేవారు. దేశం నుంచి వారు బుక్ చేసుకునే విదేశీ టూర్ ప్యాకేజీలపైనా వసూలు చేసేవారు. తాజా సవరణ ద్వారా కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు, ఎల్ఎల్పీ, ఇతరత్రాలకు సైతం 5% టీసీఎస్ నుంచి మినహాయింపునిచ్చారు. దీని వల్ల ప్రవాసులపై నిబంధన భారం తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు.
డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ పన్ను పెంపు
దిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్ఫాల్ లాభాల పన్నును లీటర్కు రూ.5 నుంచి రూ.7కు పెంచుతున్నట్లు ప్రభుత్వం గురువారం వెల్లడించింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై లీటర్కు రూ.2 పన్ను వేస్తున్నట్లు ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్నును తొలగించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడిచమురుపై పన్నును రూ.17,750 నుంచి రూ.13,000కు తగ్గించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆరు నెలల కనిష్ఠానికి చేరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
Resume Tips: రెజ్యూమె ప్రిపేర్ చేసే సమయంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్. -
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
కోటక్ మహీంద్రా బ్యాంక్పై ఆర్బీఐ పలు ఆంక్షలు విధించింది. ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. -
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
తమ బ్రాండ్ పేరు, లోగోతో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని, వీటితో అప్రమత్తంగా ఉండాలని ఎల్ఐసీ సూచించింది. -
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సిద్ధమవుతోంది. -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం! -
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..