భారీ పెట్టుబడి లావాదేవీల్లేవ్
భారత కార్పొరేట్ రంగంలో భారీ మొత్తం ఒప్పందాలు ఈ ఏడాది జులైలో బాగా తగ్గాయని గ్రాంట్ థోర్న్టన్ నివేదిక వెల్లడించింది. జులైలో 171 విలీనాలు- కొనుగోళ్లు (ఎంఅండ్ఏ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఒప్పందాలు జరిగాయి.
జులైలో రూ.16,000 కోట్ల ఒప్పందాలే
గ్రాంట్ థోర్న్టన్ నివేదిక
దిల్లీ: భారత కార్పొరేట్ రంగంలో భారీ మొత్తం ఒప్పందాలు ఈ ఏడాది జులైలో బాగా తగ్గాయని గ్రాంట్ థోర్న్టన్ నివేదిక వెల్లడించింది. జులైలో 171 విలీనాలు- కొనుగోళ్లు (ఎంఅండ్ఏ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఒప్పందాలు జరిగాయి. వీటి మొత్తం విలువ 2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.16,000 కోట్లు) ఉంది. విదేశీ లావాదేవీలు కూడా ఒప్పందాల విలువ, సంఖ్యా పరంగా గత ఏడాది వ్యవధిలో రెండో కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితులు ఇందుకు కారణం. ‘ఇతర దేశాల మాదిరిగానే ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ కూడా అధిక ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరలతో ఇబ్బందులు పడుతోంది. బలహీన రూపాయితో దిగుమతుల విలువ మరింత భారంగా మారింద’ని గ్రాంట్ థోర్న్టన్ భారత్ పార్ట్నర్, గ్రోథ్ శాంతి విజేత అన్నారు. నివేదిక ప్రకారం..
* జులైలో ఎంఅండ్ఏ ఒప్పందాలు 32 జరిగాయి. వీటి విలువ 28 కోట్ల డాలర్లు (రూ.2,240 కోట్లు). ఒప్పందాల సంఖ్య 14 శాతం, విలువ పరంగా 95 శాతం క్షీణత నమోదైందని నివేదిక పేర్కొంది. మొత్తం ఎంఅండ్ఏ ఒప్పందాల్లో 28 శాతం వాటాతో అంకురాలు, ఐటీ రంగాల హవా కొనసాగింది. ఈ రంగాల్లో తొమ్మిదేసి చొప్పున ఒప్పందాలు జరిగాయి. వీటి మొత్తం విలువ 16.2 కోట్ల డాలర్లుగా (రూ.1,296 కోట్లు) ఉంది.
* ఒప్పందాల సంఖ్యలో అంకురాలు, ఇ-కామర్స్, ఐటీ రంగాలు ముందు వరుసలో ఉండగా.. మౌలిక వసతులు, ఔషధ, రిటైల్, బ్యాంకింగ్ రంగాలు విలువపరంగా ముందంజలో నిలిచాయి.
* గత నెలలో ఒకే ఒక యూనికార్న్ (100 కోట్ల డాలర్ల) సంస్థ అవతరించింది. అది.. ఫిన్టెక్ రంగానికి చెందిన వన్కార్డ్.
* జూన్తో పోలిస్తే ఎంఅండ్ఏ ఒప్పందాలు సంఖ్యాపరంగా పెరిగినప్పటికీ.. విలువ పరంగా తగ్గాయి. పెద్ద మొత్తం లావాదేవీలు జరగకపోవడం, చాలా ఒప్పందాల్లో విలువ వివరాలను బహిర్గతపర్చక పోవడం ఇందుకు కారణంగా నివేదిక విశ్లేషించింది.
* ప్రైవేట్ ఈక్విటీ విభాగంలో 139 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ 170 కోట్ల డాలర్లు (రూ.13,600 కోట్లు). మొత్తం ఒప్పందాల్లో పీఈ ఒప్పందాల వాటా 80 శాతానికి పైగానే ఉంటుంది. అయితే ఒప్పంద విలువలో గణనీయ క్షీణత నమోదైంది.
* పీఈ విభాగ లావాదేవీల్లో అంకుర రంగ ఆధిపత్యం కొనసాగింది. జులైలో ఈ రంగం నుంచి 70 శాతం వరకు పీఈ ఒప్పందాలు జరిగాయి. పెట్టుబడుల విలువ 60 కోట్ల డాలర్లుగా ఉందని నివేదిక వివరించింది.
* అంకుర రంగంలో 20 శాతం పీఈ ఒప్పందాలతో రిటైల్ టెక్ విభాగం మొదటి స్థానంలో నిలిచింది. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్టెక్ విభాగాలు 18 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* 2022లో ఇప్పటివరకు 17 తొలి పబ్లిక్ ఆఫర్లు జరిగాయి. ఇష్యూ పరిమాణం 6 బిలియన్ డాలర్లు. 2021లో ఇదే కాలంలో 28 ఐపీఓలు జరగగా.. విలువ 7 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన