గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ
గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెన్సెక్స్ 5 రోజుల వరుస లాభాలకు విరామం ఏర్పడింది.
సమీక్ష
గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెన్సెక్స్ 5 రోజుల వరుస లాభాలకు విరామం ఏర్పడింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి క్షీణత, విదేశీ మదుపర్ల అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 20 పైసలు తగ్గి 79.84 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 1.38 శాతం నష్టంతో 95.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై, టోక్యో నష్టపోగా, హాంకాంగ్ రాణించింది. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 60,351.23 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,411.20 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. లాభాల స్వీకరణ ఫలితంగా నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 59,474.57 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 651.85 పాయింట్ల నష్టంతో 59,646.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.05 పాయింట్లు కోల్పోయి 17,758.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,710.75- 17,992.20 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 183.37 పాయింట్లు, నిఫ్టీ 60.30 పాయింట్లు చొప్పున పెరిగాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 27 నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.82%, బజాజ్ ఫిన్సర్వ్ 3.08%, బజాజ్ ఫైనాన్స్ 2.53%, టాటా స్టీల్ 2.27%, ఎస్బీఐ 2.25%, ఎన్టీపీసీ 1.90%, మారుతీ 1.81%, రిలయన్స్ 1.77%, హెచ్యూఎల్ 1.75%, ఎం అండ్ ఎం 1.75%, సన్ఫార్మా 1.69%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.66% చొప్పున డీలాపడ్డాయి. ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం స్వల్పంగా రాణించాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 2.14%, లోహ 1.84%, ఎఫ్ఎమ్సీజీ 1.24%, ఫైనాన్స్ 1.63%, చమురు-గ్యాస్ 1.62%, బ్యాంకింగ్ 1.61 నీరసపడ్డాయి. యుటిలిటీస్, యంత్ర పరికరాలు, విద్యుత్, టెక్ పెరిగాయి.
ఐఆర్సీటీసీ షేరు రయ్ రయ్: ఐఆర్సీటీసీ షేరు ధర గత 2 ట్రేడింగ్ రోజుల్లో దాదాపు 12% పెరిగింది. బుధవారం రూ.671.65 వద్ద ఉన్న షేరు, గురువారం రూ.713.05కు చేరింది. శుక్రవారం మరో 3% లాభపడి రూ.735.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.752.80 వద్ద గరిష్ఠాన్ని తాకింది. రైల్వే టికెట్లతో పాటు విమానాల టికెట్లూ బుక్ చేసుకునే వీలు ఐఆర్సీటీసీలో ఉంది. ఇందుకోసం 8.03 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఇందులో నమోదయ్యారు. రోజూ సగటున 11 లక్షల టికెట్లు విక్రయమవుతున్నాయి. ఇప్పుడీ డిజిటల్ డేటా మానిటైజ్ చేసి (ఆతిథ్య, రవాణా, బీమా, ఆర్థిక సేవల సంస్థలకు అందించడం) దాదాపు రూ.1000 కోట్ల వరకు ఆర్జించవచ్చన్నది ఐఆర్సీటీసీగా ఆలోచనగా వార్తలు రావడమే, షేరు దూసుకెళ్లడానికి కారణం. కొత్త వ్యాపారావకాశాలను అన్వేషిస్తున్నామని, అందులో భాగంగానే సలహాదారును నియమించుకోవడానికి టెండర్ ఆహ్వానించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే డేటా గోప్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
* కేఎస్కే మహానది పవర్ కంపెనీ మొండి ఖాతాను ఆదిత్య బిర్లా ఏఆర్సీకి రూ.1,622 కోట్లకు ఎస్బీఐ విక్రయించింది. మొత్తం బకాయిలో దాదాపు 58 శాతం తక్కువ విలువకే విక్రయించింది. 2022 ఏప్రిల్కు చూస్తే ఎస్బీఐకు కేఎస్కే మహానది పవర్ కంపెనీ రూ.3,815.04 కోట్లు బకాయిపడి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’