చిప్ సెట్ రూ.80 లక్షల కోట్లు
కార్లు, బైక్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల రంగాల నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్లకు గిరాకీ అనూహ్యంగా పెరుగుతోంది. కొవిడ్ పరిణామాల వల్ల, గతేడాది గిరాకీకి అనుగుణంగా వీటి సరఫరాలు సాధ్యం కాలేదు. ఇప్పటికీ పరిశ్రమల అవసరాలకు సరిపడా సెమీకండక్టర్ల సరఫరా ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల మార్కెట్
2030 నాటికి దేశీయ మార్కెట్ విలువ
డిజైన్ సేవలకూ గిరాకీ
పరిశోధన, ఉత్పత్తి విస్తరించే అవకాశం
కార్లు, బైక్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల రంగాల నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్లకు గిరాకీ అనూహ్యంగా పెరుగుతోంది. కొవిడ్ పరిణామాల వల్ల, గతేడాది గిరాకీకి అనుగుణంగా వీటి సరఫరాలు సాధ్యం కాలేదు. ఇప్పటికీ పరిశ్రమల అవసరాలకు సరిపడా సెమీకండక్టర్ల సరఫరా ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.80 లక్షల కోట్ల)కు చేరుతుందని హైదరాబాద్కు చెందిన మాస్ చిప్ టెక్నాలజీస్ వార్షిక సమావేశంలో (ఏజీఎం)లో సీఈఓ వెంకట్ సింహాద్రి అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం భారత్కు ఉందన్నారు. మనదేశంలో వీఎల్ఎస్ఐ/ ఎంబెడెడ్ డిజైన్ సర్వీసెస్ మార్కెట్ వచ్చే ఏడాదిలో 7.37 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రధానంగా వాహన, డేటా స్టోరేజ్, వైర్లెస్ విభాగాల నుంచి అధిక డిమాండ్ ఉంటుందని సమాచారం.
డిజైనింగ్లో దేశీయంగా లక్ష మంది
చిప్ డిజైన్లో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లక్ష మందికి పైగా చిప్ డిజైన్ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. దేశీయ సంస్థల్లో విప్రో, హెచ్సీఎల్, క్యాప్జెమినీ, ఎల్అండ్టీ ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ విభాగంలో మనదేశం వచ్చే కొంతకాలం పాటు రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని భావిస్తున్నారు. సెమీకండక్టర్ల కోసం మనదేశం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇటీవలి పరిణామాలకు తోడు, ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.80,000 కోట్ల) పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల చిప్లు, డిస్ప్లే, చిప్ డిజైన్ విభాగాల్లో కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఏర్పడింది. కనీసం 100 కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వ వర్గాల అంచనా.
అమెరికా రెండు దశాబ్దాలుగా సెమీకండక్టర్ పరిశోధన- డిజైనింగ్ సేవలకు పరిమితమై, ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించలేదు. ఫలితంగా తైవాన్, కొరియా, జపాన్, చైనాలో సెమీకండక్టర్ ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగాయి. తాజాగా అమెరికా ప్రభుత్వం సెమీకండక్టర్ ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించింది. ఇందుకోసం ‘చిప్స్ యాక్ట్’ ను ఆమోదించింది. ఇంటెల్ అతిపెద్ద చిప్సెట్ తయారీ ప్లాంటును నిర్మించనుంది. అమెరికాలో సెమీకండక్టర్ ఉత్పత్తి విభాగంలో 52 బి.డాలర్ల (సుమారు రూ.4.16 లక్షల కోట్ల) పెట్టుబడులు సమకూరతాయని అంచనా. ఈ పరిణామాలను విశ్లేషిస్తే వచ్చే కొన్నేళ్ల పాటు సెమీకండక్టర్ల రంగం వేగంగా విస్తరించనుందని స్పష్టమవుతోంది. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడానికి మనదేశమూ సిద్ధం కావడం ఆసక్తికర పరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
20 సంస్థలకు సేవలు
మాస్చిప్ టెక్నాలజీస్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 అగ్రగామి సెమీకండక్టర్ కంపెనీలకు సేవలు అందిస్తోంది. దాదాపు వెయ్యి మంది సిబ్బందితో వేగంగా తమ సేవలను విస్తరిస్తోంది. పీఎల్ఐ పథకంలో పాల్గొనే అవకాశం తమకు లేదని, దీనికి బదులుగా డీఎల్ఐ పథకంతో లబ్ధి పొందేందుకు వీలుగా సెమీకండక్టర్ ఉత్పత్తులు / మేధోసంపత్తి (ఐపీ) హక్కులపై దృష్టి సారిస్తున్నట్లు మాస్చిప్ టెక్నాలజీస్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.