పండగల వేళ చిన్న రుణాలకు గిరాకీ
కొవిడ్ పరిణామాలతో రెండేళ్లుగా పండగలు వెలవెలబోయాయి. గృహోపకరణాలు మొదలు, వాహనాల వరకు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడింది.
రూ.5-50 వేల వరకు
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్టెక్ అంకురాలూ సిద్ధం
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ పరిణామాలతో రెండేళ్లుగా పండగలు వెలవెలబోయాయి. గృహోపకరణాలు మొదలు, వాహనాల వరకు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడింది. ఈసారి కరోనా భయాలు దాదాపుగా అంతరించాయి. దీంతో రానున్న పండగల వేళ రిటైల్ రుణాలకు మళ్లీ గిరాకీ పెరుగుతుందని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫిన్టెక్ అంకురాలూ భావిస్తున్నాయి. రుణగ్రహీతల అవసరాలకు తగ్గట్టుగా నిధులు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. దసరా, దీపావళి పండగల సందర్భంగా ఇ-కామర్స్ సైట్లు ప్రత్యేక ఆఫర్లతో, భారీ అమ్మకాలు చేపట్టనున్నాయి. ‘గృహోపకరణాలు, సరికొత్త స్మార్ట్ఫోన్లను ఇంటికి తెచ్చుకునేందుకు, అవసరమైతే రుణాలు తీసుకోవాలని ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రూ.12,000-50,000 విలువైన రిటైల్ రుణాల్లో వృద్ధి కనిపించే అవకాశం ఉంద’ని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఫిన్టెక్ సంస్థలు..
క్రెడిట్ స్కోరుతో సంబంధం లేకుండా రుణాలను అందించే ఫిన్టెక్ సంస్థలు, పీ2పీ రుణ సంస్థలు కొత్త రుణగ్రహీతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు రూ.5 వేల నుంచీ రుణం మంజూరు చేస్తున్నాయి. గరిష్ఠంగా రూ.40-50వేల వరకు ఇస్తున్నాయి. వాయిదాల్లో సులభంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తుండటంతో, కొన్ని ఫిన్టెక్ సంస్థల రుణ వితరణ దాదాపు 4 రెట్లకు పైగా వృద్ధి సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
బీఎన్పీఎల్కు ఆదరణ
బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు, ఫిన్టెక్ అంకురాలూ బీఎన్పీఎల్ (ఇప్పుడు కొనండి, తరవాత చెల్లించండి) సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ విధానంలో క్రెడిట్ స్కోరుకు అనుగుణంగా సులభంగా రుణం లభిస్తోంది. ఎక్కువ సంస్థలు గరిష్ఠంగా రూ.20వేల వరకే ఈ ఆఫర్ ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు రూ.40వేల వరకు అందిస్తున్నాయి. నిర్ణీత వ్యవధి తర్వాత ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఇందులోని ప్రతికూలతగా చెప్పొచ్చు.
డిపాజిట్లలోనూ..
రుణ వృద్ధి పెరుగుతున్నందున, అందుకు కావాల్సిన నిధుల కోసం డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్లు ఇలాంటి ప్రత్యేక డిపాజిట్లపై 6.05- 6.10% వరకు వడ్డీనిస్తున్నాయి.
రుసుముల్లో రాయితీలు..
గృహ, వాహన రుణాల జారీనిమిత్తం వసూలు చేసే పరిశీలనా రుసుము, ఇతర ఛార్జీలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు డిసెంబరు 31 వరకు తీసుకునే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో కొంత మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాయి.
ప్రత్యేక ఆఫర్లతో..
కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు బ్యాంకులూ కొత్త రుణ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి ముందుగానే రుణాలను మంజూరు (ప్రీ-అప్రూవల్) చేస్తున్నాయి. వేతన ఖాతాలు ఉన్న వారికి శాలరీ అడ్వాన్సు రుణాలు సైతం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు.. తమ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఇ-కామర్స్ సంస్థలు, సంప్రదాయ దుకాణాల్లో కొనుగోలు చేసినా, ప్రత్యేక రాయితీ ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. కొన్ని సంస్థల ఉత్పత్తులపై వడ్డీలేని సులభ వాయిదా, నగదు వాపసు వంటి సౌలభ్యాలను అందిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్