ఆర్ఈసీకి మహారత్న హోదా
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్ఈసీకి మహారత్న హోదా దక్కింది. కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ హోదా పొందిన 12వ సంస్థగా ఆర్ఈసీ నిలిచింది.
ఈ ఘనత పొందిన 12వ ప్రభుత్వరంగ సంస్థ
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్ఈసీకి మహారత్న హోదా దక్కింది. కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ హోదా పొందిన 12వ సంస్థగా ఆర్ఈసీ నిలిచింది. ఈ హోదా వల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకునే విషయంలో సంస్థ పాలకమండలికి విస్తృత అధికారాలు లభించనున్నాయి. దేశం లోపల, బయట సంయుక్త సంస్థలు, సంపూర్ణ యాజమాన్యహక్కులున్న అనుబంధ సంస్థలు, విలీనాలు, ఇతర సంస్థల స్వాధీనతకు ఈ సంస్థ పాలకమండలికి అధికారాలు లభిస్తాయి. ఒక్కో ప్రాజెక్టులో గరిష్ఠంగా రూ.5000 కోట్లు గానీ, లేదంటే తన నెట్వర్త్లో 15% మొత్తాన్ని కానీ పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. సిబ్బంది, మానవ వనరుల నిర్వహణ, శిక్షణ వ్యవహారాలకు ఈ సంస్థ ప్రత్యేక విధానాన్ని అమలు చేసుకోవచ్చు. ఇతర సంస్థలతో సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దేశంలో విద్యుత్తు రంగానికి ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం 1969లో ఆర్ఈసీని ఏర్పాటుచేసింది.
మహారత్న హోదా లభించిన సందర్భంగా ఆర్ఈసీ సీఎండీ వివేక్ దేవాంగన్ మాట్లాడుతూ కొవిడ్ సమయంలోనూ నిలకడగా పనితీరు కనబరచడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. 2021-22లో ఎన్నడూలేని విధంగా రూ.10,046 కోట్ల లాభం సంపాదించడంతో పాటు, కంపెనీ నికర విలువ రూ.50,986 కోట్లకు చేరిందని చెప్పారు. వనరుల సమర్థ నిర్వహణ, బలమైన ఆర్థిక విధానాలు ఇందుకు దోహదపడినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికీ, ప్రతింటికీ విద్యుత్తు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన దీన్దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన, సౌభాగ్య పథకాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆర్ఈసీ కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. డిస్కంల పునరుద్దరణ పథకం అమలులో ఆర్ఈసీ నోడల్ ఏజెన్సీ పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. మహారత్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గదర్శనం చేసిన కేంద్ర విద్యుత్తుశాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
* మూడేళ్లపాటు వరుసగా రూ.25వేల కోట్ల టర్నోవర్, రూ.15వేల కోట్ల నికరవిలువ, రూ.5వేల కోట్లకు పైగా నికర లాభం సాధించిన ప్రభుత్వరంగ సంస్థలకు ఈ హోదా ఇస్తారు.
* ఇప్పటివరకు మహారత్న హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థల్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, గెయిల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి