ఇ-కామర్స్ ఆర్డర్లు 28 శాతం పెరిగాయ్
పండగ విక్రయాలు ప్రారంభమైన తొలి 2 రోజుల్లో ఇ-కామర్స్ పోర్టళ్లకు ఆర్డర్లు, గతేడాది విక్రయాలతో పోలిస్తే 28 శాతం పెరిగాయని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్ యూనికామర్స్ వెల్లడించింది. ఇ-కామర్స్ సంస్థలతో పాటు, వాటిల్లో ఉత్పత్తులు విక్రయించే
దిల్లీ: పండగ విక్రయాలు ప్రారంభమైన తొలి 2 రోజుల్లో ఇ-కామర్స్ పోర్టళ్లకు ఆర్డర్లు, గతేడాది విక్రయాలతో పోలిస్తే 28 శాతం పెరిగాయని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్ యూనికామర్స్ వెల్లడించింది. ఇ-కామర్స్ సంస్థలతో పాటు, వాటిల్లో ఉత్పత్తులు విక్రయించే 15,000 మంది వ్యాపారులు, 7,000 గోదాములు, 1500 విక్రయశాలలకు ఈ సంస్థ సేవలందిస్తోంది. ఈనెల 23, 24 తేదీల్లో ఇ-కామర్స్ సంస్థలకు 70 లక్షల ఉత్పత్తులకు ఆర్డర్ రాగా, ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలిపింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో 70%, ఎలక్ట్రానిక్స్లో 48% (మొబైల్స్ మినహాయించి), ఫ్యాషన్ ఉత్పత్తుల్లో 7 శాతం వృద్ధి లభించిందని, హోమ్ డెకార్, గిఫ్టింగ్కి పనికొచ్చేవి, ఫర్నీచర్, ఆభరణాల అమ్మకాల్లోనూ వృద్ధి బాగుందని తెలిపింది.
* మూడు-రెండో అంచె నగరాల ఆర్డర్లలో వరుసగా 32 శాతం, 20 శాతం వృద్ధి లభించిందని పేర్కొంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా, తమ మొత్తం వినియోగదార్లలో 75 శాతం మంది 2-3 అంచె నగరాల నుంచే ఉన్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది.
తొలిరోజే రూ.1,000 కోట్ల స్మార్ట్ఫోన్ల విక్రయం: శామ్సంగ్
పండగ విక్రయాల తొలిరోజునే అమెజాన్, ఫ్లిప్కార్ట్ల ద్వారా రూ.1,000 కోట్ల విలువైన 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లు విక్రయించినట్లు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఇండియా ప్రకటించింది. ఫోన్ల ధరలను 17-60 శాతం తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. అమెజాన్లో విక్రయించిన ప్రతి 3 ఫోన్లలో ఒకటి శామ్సంగ్దేనని, అత్యధికంగా గెలాక్సీ ఎం13 విక్రయమైందని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?