Air India: 2-3 రోజుల్లోనే ఎయిరిండియా టికెట్‌ రిఫండ్‌

అర్హులైన ప్రయాణికులకు 2-3 రోజుల్లోనే టికెట్‌ రిఫండ్‌లు అందిస్తున్నామని ఎయిరిండియా వెల్లడించింది. కొవిడ్‌ సమయంలో, ఆ తర్వాత పరిణామాల్లోనూ ప్రయాణాలు రద్దు చేసుకోవడం, సర్వీసులు నిలిచిపోవడంతో, చాలా విమానయాన సంస్థలకు రిఫండ్‌లు

Updated : 27 Sep 2022 08:12 IST

దిల్లీ: అర్హులైన ప్రయాణికులకు 2-3 రోజుల్లోనే టికెట్‌ రిఫండ్‌లు అందిస్తున్నామని ఎయిరిండియా వెల్లడించింది. కొవిడ్‌ సమయంలో, ఆ తర్వాత పరిణామాల్లోనూ ప్రయాణాలు రద్దు చేసుకోవడం, సర్వీసులు నిలిచిపోవడంతో, చాలా విమానయాన సంస్థలకు రిఫండ్‌లు సమస్యగా మారాయని సంస్థ తెలిపింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి ఎయిరిండియా బయటకు వచ్చిన కొన్ని నెలల్లోనే 2.5 లక్షలకు పైగా కేసుల్లో సుమారు రూ.150 కోట్లకు పైగా రిఫండ్‌లు ప్రాసెస్‌ చేశామని వివరించింది. ప్రస్తుతం అర్హులైన ప్రయాణికులు తమ వెబ్‌సైట్‌లో రిఫండ్‌ రిక్వెస్ట్‌ పెట్టిన 2-3 రోజుల్లోనే ప్రాసెస్‌ చేస్తున్నామని ఎయిరిండియా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని