‘పౌండ్’ విలువా పతన బాటే
బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ అమెరికా డాలరుతో పోలిస్తే కొత్త జీవన కాల కనిష్ఠానికి చేరింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారొచ్చనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వం భారీగా పన్ను కోతలు ప్రకటించడం మదుపర్లలో ఆందోళనకు దారి తీసింది.
లండన్: బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ అమెరికా డాలరుతో పోలిస్తే కొత్త జీవన కాల కనిష్ఠానికి చేరింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారొచ్చనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వం భారీగా పన్ను కోతలు ప్రకటించడం మదుపర్లలో ఆందోళనకు దారి తీసింది. ఇదే.. కరెన్సీ విలువ క్షీణతకు కారణమైంది. సోమవారం ఉదయం ట్రేడింగ్లో 1.07 డాలర్ల ఎగువన కదలాడిన పౌండు విలువ.. ఆ తర్వాత 1.0373 డాలర్లకు పడిపోయింది. 1971లో కరెన్సీ డెసిమలైజేషన్ తర్వాత పౌండ్కు ఇదే జీవనకాల కనిష్ఠ స్థాయి. 50 ఏళ్లలోనే అత్యధిక పన్నుల కోతను ప్రకటించాక... శుక్రవారం నుంచి పౌండు విలువ 5 శాతం వరకు క్షీణించడం గమనార్హం. ఇటీవలే అధికార పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం 45 బిలియన్ పౌండ్ల (49 బిలియన్ డాలర్ల) విలువ మేర పన్ను కోతలను విధించే ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐరోపా భవిష్యత్తు అంధకారంగా.. ఈసీబీ: ఐరోపా ఆర్థిక భవిష్యత్ అంధకారంగా మారుతోందని ఐరోపా కేంద్ర బ్యాంక్ (ఈసీబీ) అధిపతి క్రిస్టీన్ లగార్డే పేర్కొన్నారు. రాబోయే నెలల్లో వ్యాపార కార్యకలాపాలు నెమ్మదించొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా ప్రాంతం మాంద్యంలోకి జారుకునే అంశంపై ఆమె ఐరోపా పార్లమెంట్కు వివరణ ఇచ్చారు. ఆర్థికాభివృద్ధి మందకొడిగానే ఉందని, రష్యా సహజవాయువు సరఫరా వంటి పరిణామాలు ఆనిశ్చితి పెంచాయన్నారు. 2022 నాలుగో త్రైమాసికంతో పాటు 2023 మొదటి మూడు నెలల్లో ప్రతికూల వృద్ధి నమోదుకావొచ్చని అంచనా వేశారు. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధి నమోదైతే మాంద్యంగా పరిగణిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు