వాహనాలకు పండగ ఉత్సాహం!
దసరా - దీపావళి పండగల సమయంలో కొత్త వాహనాలు కొనేందుకు అధికులు ఉత్సాహం చూపుతారు. కొవిడ్ పరిణామాలు, చిప్ కొరత వల్ల గత రెండేళ్లు విక్రయాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ అవరోధాలు తొలగినందున,
దసరా - దీపావళి పండగల సమయంలో కొత్త వాహనాలు కొనేందుకు అధికులు ఉత్సాహం చూపుతారు. కొవిడ్ పరిణామాలు, చిప్ కొరత వల్ల గత రెండేళ్లు విక్రయాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ అవరోధాలు తొలగినందున, వాహన కంపెనీలు ఈసారి తమ విక్రయాలు పెంచుకునేందుకు సరికొత్త మోడళ్లను విడుదల చేస్తూ, సులభ వాయిదాలపై కొనుగోలుకు రుణ సదుపాయాన్నీ కల్పిస్తున్నాయి.
గ్రాండ్ విటారా రూ.10.45-19.65 లక్షలు
వేగంగా వృద్ధి చెందుతున్న మధ్య స్థాయి స్పోర్ట్స్ వినియోగ విభాగంలో గ్రాండ్ విటారాను మారుతీ సుజుకీ ఇండియా సోమవారం విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.10.45-19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ). 1.5 లీటర్ పెట్రోల్ పవర్ట్రెయిన్ మేటెడ్, స్ట్రాంగ్ అండ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజిన్తో రూపొందిన ఈ కారు, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్లతో పోటీ పడబోతోంది. ఇప్పటికే ఈ మోడల్కు 57,000 బుకింగ్లు లభించాయని కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి టకూచి వెల్లడించారు. మైల్డ్ టెక్నాలజీ మేటెడ్ 5-స్పీడ్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ధరలు రూ.10.45-17.05 లక్షలుగా ఉన్నాయి. వేరియంట్ను బట్టి 21.11 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని కంపెనీ తెలిపింది. సుజుకీ పేటెంట్ ఆల్ గ్రిప్ టెక్నాలజీతో రూపొందిన ఆల్గ్రిప్ సెలెక్ట్ ట్రిమ్ వాహన ధర రూ.16.89 లక్షలుగా ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్తో రూపొందిన వేరియంట్లు రూ.17.99-19.65 లక్షల మధ్య ఉన్నాయని, ఇవి 27.97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని కంపెనీ తెలిపింది. దేశ వ్యాప్తంగా 420 నెక్సా విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తున్నట్లు పేర్కొంది.
టాటా మోటార్స్ 4 పికప్ మోడళ్లు
ఈనాడు, హైదరాబాద్: ప్రత్యామ్నాయ ఇంధనం, విద్యుత్ వాణిజ్య వాహనాల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.2,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వెల్లడించారు. సోమవారం టాటా మోటార్స్ కొత్తగా తీసుకొచ్చిన పికప్ వాహనాలు యోధా 2.0 (1200- 2,000 కిలోల పేలోడ్), ఇంట్రా వి 50 (1500 కిలోలు), ఇంట్రా వి20 (సీఎన్జీ - పెట్రోలు, 1,000 కిలోల పేలోడ్) మోడళ్లను హైదరాబాద్ నుంచి దేశీయ విపణిలోకి విడుదల చేసిన వాఘ్ ఈ వివరాలు వెల్లడించారు. యోధా 2.0 ప్రారంభ ధర రూ.9.9 లక్షలు, యోధా ఈఎక్స్ ధర రూ.10.74లక్షలు, ఇంట్రా వీ50 ధర రూ.8.67 లక్షలు (ఎక్స్షోరూం)గా ఉన్నాయి.
ఇప్పటికే సరకు రవాణా విభాగంలో ఆవిష్కరించిన టాటా ఏస్ ఈవీని అక్టోబరు నుంచి డెలివరీ చేయబోతున్నట్లు వివరించారు. మధ్యస్థాయి, తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగంలో 40 శాతం, చిన్న వాణిజ్య వాహనాల్లో 20 శాతం సీఎన్జీ మోడళ్లు ఉంటాయని తెలిపారు. 3700 కోట్ల డాలర్ల వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అగ్రగామిగా ఉందని, తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగంలో 40శాతం మార్కెట్ వాటా తమ సొంతమని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, ఎఫ్ఎంసీజీ, ఇ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త వాహనాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
2021-22లో టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగం 36 శాతం వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. వాణిజ్య వాహనాల విభాగంలో స్థానిక గిరాకీ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఇంధన ధరలు కీలకం అని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 26 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు. బస్సులతో పాటు, తేలికపాటి వాణిజ్య వాహనాల్లో విద్యుత్ మోడళ్లు తీసుకొస్తామని, క్రమంగా ఇతర వాహనాలకూ విస్తరిస్తామని తెలిపారు.
హీరో మోటోకార్ప్ 8 కొత్త మోడళ్లు
ఈ పండుగ సీజన్లో వినియోగదారు సెంటిమెంట్ను అనుకూలంగా మార్చుకునేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమవుతోంది. ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 ఎడిషన్ మొదలుకుని హెచ్ఎఫ్ సిరీస్, స్ల్పెండర్+, గ్లామర్లో 8 కొత్త వేరియంట్లను త్వరలోనే తీసుకొస్తామని సంస్థ తెలిపింది.
కవాసాకి కొత్త బైక్లు జీ రూ.1.47-1.49 లక్షలు
‘భారత్ తయారీ’ డబ్ల్యూ175ఎంవై23ను దేశీయ విపణిలో కవాసాకి విడుదల చేసింది. ఈ బైక్ల ధరలు రూ.1.47-1.49 లక్షలు. ఈ బైక్ను స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో తీసుకొచ్చింది. వీటి డెలివరీలు డిసెంబరులో మొదలవుతాయని, ప్రారంభ ధర పరిమిత బైక్లకే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అదేంటో చూద్దాం.. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు