రూపాయి దారెటు!
డాలర్తో పోలిస్తే రూపాయి ఇంకా బలహీనపడింది. ఎన్నడూ లేనంతగా డాలర్ విలువ రూ.81.67 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతోందనే భయాలు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ ఉన్నాయి.
డాలర్తో పోల్చితే 81.67 కి పతనం
ద్రవ్యోల్బణం, మాంద్యం భయాల వల్లే
మన కరెన్సీలో విదేశీ వాణిజ్యం ఉపకరిస్తుందా?
డాలర్తో పోలిస్తే రూపాయి ఇంకా బలహీనపడింది. ఎన్నడూ లేనంతగా డాలర్ విలువ రూ.81.67 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతోందనే భయాలు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ ఉన్నాయి. అమెరికాలో బాండ్లపై వడ్డీరేట్లు పెరగడం, డాలర్ బలంగా మారడంతో, సురక్షితమని భావిస్తున్నవారు పెట్టుబడులను అమెరికా మళ్లిస్తున్నారు. దీనివల్ల దాదాపు అన్ని దేశాల కరెన్సీ విలువలు క్షీణిస్తున్న విషయం విదితమే.
ఆసియా ప్రాంతంలోని ప్రధానమైన చైనా (యువాన్), జపాన్ (యెన్) కరెన్సీల విలువలు కూడా డాలర్తో పోలిస్తే పతనం కావడంతో పెట్టుబడిదార్లు వర్థమాన మార్కెట్లలో విక్రయాలు జరిపి, నిధులను వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇదే రూపాయి విలువ క్షీణతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. విదేశీ ఎగుమతి, దిగుమతుల లావాదేవీలను రూపాయల్లో నిర్వహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, కొంతమేరకు అయినా రూపాయి విలువను కాపాడతాయనే అంచనాలున్నాయి.
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం 81.09 కాగా, సోమవారం మరో 58 పైసలు క్షీణించి 81.67కు దిగివచ్చింది. 4 ట్రేడింగ్ రోజుల్లోనే రూపాయి విలువ 193 పైసలు పతనమైంది. ఇప్పటికే వివిధ దేశాల కరెన్సీ విలువలు పతనం అవుతున్నాయి. వాటితో పోల్చితే రూపాయి పతనం తక్కువగానే ఉంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం దిగి రాని పక్షంలో రూపాయి విలువ ఇంకా తగ్గిపోవచ్చని ఫారెక్స్ (విదేశీ మారకపు నిల్వల) మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈనెల 30న పరపతి విధానాన్ని ప్రకటించనుంది. కీలక వడ్డీరేట్లను మరో 0.50 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రూపాయి మారకపు విలువపై స్పష్టత వస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి డాలర్ విలువ రూ.80.50- 82.00 మధ్య ఉంటుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది.
రూపాయి వర్తకం ఆదుకుంటుందా
ఇటీవల కాలంలో అంతర్జాతీయ వర్తకాన్ని రూపాయిల్లో (రూపీ ట్రేడ్) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంటే మనదేశం నిర్వహించే ఎగుమతులు- దిగుమతులకు డాలర్ల బదులు రూపాయిల్లో చెల్లింపులు జరుగుతాయి. రష్యా, ఇరాన్, యూఏఈ దేశాలు దీనికి సుముఖత వ్యక్తం చేసి, విధివిధానాలు ఖరారు చేసే యత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తేయాకు, ముడి చమురు, కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తుల విదేశీ వర్తకాన్ని రూపాయిల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మనదేశం నుంచి ఎగుమతి చేసే తేయాకుకు రష్యా, యూఏఈ దేశాలు రూపాయిల్లో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని టీ అసోషియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ పి.కె.భట్టాచార్య వివరించారు. త్వరలో రష్యా నుంచి రూపాయి వర్తకం మొదలవుతుందని, తదుపరి మిగిలిన దేశాల ముందుకు రావచ్చని పేర్కొన్నారు.
తేయాకు ఎగుమతులకు మరిన్ని అవకాశాలు
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆ దేశం నుంచి తేయాకు కొనుగోలు చేస్తున్న ఇరాక్, సిరియా, టర్కీ, పోలెండ్ వంటి దేశాలు ఇప్పుడు మనదేశం వైపు చూస్తున్నాయి. మనదేశం నుంచి తేయాకు ఎగుమతి చేసే కంపెనీలను ఆయా దేశాలు సంప్రదిస్తున్నాయి.మరికొన్ని ఇతర వస్తువులను ‘రూపీ ట్రేడ్’ కిందకు తీసుకు రాగలిగితే, డాలర్ వినియోగం తగ్గి, రూపాయి మారకపు విలువపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా రూపాయి మారకపు విలువ స్ధిరంగా ఉండటమే కాక, ఎగుమతులు ఇంకా పెంచుకునే అవకాశం కలుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె