ఐఎల్ఖీఎఫ్ఎస్ ఛైర్మన్గా సి.ఎస్.రాజన్
రుణ పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ బోర్డులో మార్పుచేర్పులను ప్రభుత్వం చేపట్టింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్న సి.ఎస్.రాజన్కు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదా కల్పించారు.
బోర్డులో మార్పు చేర్పులు
దిల్లీ: రుణ పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ బోర్డులో మార్పుచేర్పులను ప్రభుత్వం చేపట్టింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్న సి.ఎస్.రాజన్కు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదా కల్పించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నంద్ కిశోర్ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. పలు ఆర్థిక అవకతవకలు వెలుగు చూడటంతో 2018 అక్టోబరులో ఐఎల్అండ్ఎఫ్ఎస్ అప్పటి బోర్డును కార్పొరేట్ వ్యవహారాల శాఖ రద్దు చేసి, బోర్డులో కొత్త సభ్యులను నియమించింది. ఐఎల్అండ్ఎఫ్ఎస్లో 347 సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 246 సంస్థలు దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. సుమారు నాలుగేళ్లుగా ఐఎల్అండ్ఎఫ్ఎస్ బోర్డుకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న ఉదయ్ కోటక్ పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగిసింది. అప్పటి నుంచి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన హోదాను నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా మార్పు చేసింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చి, 2023 మార్చి వరకు వర్తిస్తాయి. ప్రస్తుతం ఐఎల్అండ్ఎఫ్ఎస్ బోర్డులో ఐదుగురు సభ్యులు- రాజన్, కిశోర్, జి.సి.చతుర్వేది, మాలిని శంకర్, ఎన్.శ్రీనివాసన్ ఉన్నారు. వీరిలో చతుర్వేది పదవీకాలం సెప్టెంబరు 30న ముగియనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా