అతి స్వల్ప నష్టాలు
ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో మంగళవారం సూచీలు అతి స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ముగియడం మాత్రం వరుసగా ఇది అయిదో రోజు. లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
సమీక్ష
ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో మంగళవారం సూచీలు అతి స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ముగియడం మాత్రం వరుసగా ఇది అయిదో రోజు. లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలతో సెంటిమెంట్ బలహీనంగా మారింది. డాలర్తో పోలిస్తే రూపాయి 14 పైసలు కోలుకుని 81.53 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 1.78 శాతం పెరిగి 85.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 57,376.52 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 560 పాయింట్ల లాభపడి 57,704.57 వద్ద గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. 56,950.52 పాయింట్లకు పడిపోయింది. చివరకు 37.70 పాయింట్ల నష్టంతో 57,107.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 8.90 పాయింట్లు తగ్గి 17,007.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,942.35- 17,176.45 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 13 నష్టపోయాయి. టాటా స్టీల్ 2.25%, టైటన్ 2.15%, కోటక్ బ్యాంక్ 1.52%, ఎస్బీఐ 1.39%, టెక్ మహీంద్రా 1.08%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.96% చొప్పున డీలాపడ్డాయి. పవర్గ్రిడ్ 1.81%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.32%, హెచ్సీఎల్ టెక్ 1.25%, డాక్టర్ రెడ్డీస్ 1.20%, నెస్లే 1.19%, ఏషియన్ పెయింట్స్ 0.94% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ, యంత్ర పరికరాలు, బ్యాంకింగ్ నీరసపడ్డాయి. చమురు-గ్యాస్, ఇంధన, ఐటీ, ఆరోగ్య సంక్షరణ మెరిశాయి బీఎస్ఈలో 1639 షేర్లు నష్టాల్లో ముగియగా, 1769 స్క్రిప్లు లాభపడ్డాయి. 132 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* ఒడిశాలోని తాల్చేర్లో 2శ్రీ660 మెగావాట్ ధర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయడానికి ఎన్టీపీసీ నుంచి ఆర్డరు అందుకున్నట్లు భెల్ వెల్లడించింది.
* ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్లో 7.7 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా 325 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,650 కోట్లు) సమీకరించినట్లు బ్లాక్స్టోన్ తెలిపింది.
* స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తుల విస్తరణతో పాటు డౌన్స్ట్రీమ్ రంగంలో బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8000 కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్సెలార్ మిత్తల్ అనుబంధ సంస్థ ఏఎంఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిత్తల్ వెల్లడించారు. ఏఎంఎన్ఎస్ ఇండియాలో ఆర్సెలార్ మిత్తల్కు 60 శాతం వాటా ఉంది. మాతృసంస్థ ఆర్సెలార్ మిత్తల్కు సైతం ఆదిత్య మిత్తల్ సీఈఓగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?