అదానీ.. రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి
కొత్త ఇంధనం, డేటా కేంద్రాలతో కూడిన డిజిటల్ విభాగంపై రాబోయే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టనున్నామని అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.
పదేళ్లలో కొత్త ఇంధనం, డేటా కేంద్రాలపై
వినియోగదారుల సేవలకు సూపర్యాప్లు
దిల్లీ: కొత్త ఇంధనం, డేటా కేంద్రాలతో కూడిన డిజిటల్ విభాగంపై రాబోయే దశాబ్ద కాలంలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టనున్నామని అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఈ పెట్టుబడుల్లో 70 శాతం వరకు కొత్త ఇంధనం విభాగంపైనే వెచ్చిస్తామని సింగపూర్లో జరిగిన ఫోర్బ్స్ గ్లోబల్ సీఈఓల సమావేశంలో ఆయన వెల్లడించారు. కొత్త ఇంధనంపై తమ గ్రూపు ప్రణాళికలను క్రమంగా వెల్లడిస్తామన్నారు.
సింగపూర్ విస్తీర్ణానికి మించిన స్థలంలో హైబ్రిడ్ విద్యుత్తు ప్రాజెక్టులు: ‘ప్రస్తుతం మాకు 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం ఉంది. దీనికి మరో 45 గిగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం జతచేరుస్తాం. ఈ ప్రాజెక్టులు 10,000 హెక్టార్ల స్థలంలో విస్తరిస్తాయి. సింగపూర్ విస్తీర్ణం కంటే ఇది 1.4 రెట్లు ఎక్కువ. ఈ ప్రాజెక్టుల సాయంతో, విక్రయానికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని అందుబాటులోకి తేగలుగుతామ’ని అదానీ చెప్పారు. 10 గిగావాట్ల సౌర ప్యానెళ్లు, 10 గిగా వాట్ల గాలి మరలు, 5 గిగావాట్ల హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారీకి 3 గిగా ఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీన్ ఎలక్ట్రాన్ను అత్యంత చౌకగా ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటిగా అవతరిస్తామని, ఆ తర్వాత అత్యంత చౌకగా హరిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే సంస్థగా నిలుస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పర్యావరణ హిత డేటా కేంద్రాలు
భారత డేటా కేంద్రాల విపణి గణనీయ వృద్ధి నమోదు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో ఇతర ఏ పరిశ్రమ కంటే, ఈ రంగమే అత్యధికంగా ఇంధనాన్ని వినియోగించుకుంటోందని తెలిపారు. అందుకే స్వచ్ఛ డేటా కేంద్రాలను అభివృద్ధి చేయాలనే తమ ప్రణాళిక.. ఓ మేలిమలుపు అవుతుందని అన్నారు. రాబోయే 10 ఏళ్ళలో అదానీకనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 1,000 మెగావాట్ల డేటా కేంద్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. వీటిని సముద్రగర్భ కేబుళ్ల ద్వారా అనుసంధానిస్తామన్నారు.
రిలయన్స్, టాటాలకు పోటీగా సూపర్యాప్
వినియోగదారులకు పలు రకాల సేవలను అందించే సూపర్ అప్లికేషన్ (సూపర్ యాప్)లు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అదానీ గ్రూపు నిర్వహిస్తున్న ఎఫ్ఎమ్సీజీ, సిమెంటు, విద్యుత్ పంపిణీ, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సిమెంటు వ్యాపారాలకు చెందిన లక్షల మంది వినియోగదారులకు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సేవలందించేందుకు ఈ యాప్లు తోడ్పడుతాయని అన్నారు. ఈ సూపర్ యాప్ల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూపులకు అదానీ గ్రూప్ పోటీ ఇవ్వనుంది.
ఒంటరి భావనలో చైనా
‘భారత్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అసలైన భారత వృద్ధి గాథ ఇప్పుడే ప్రారంభమైంది. ప్రపంచంపై భారత్ ప్రభావమేమిటో రాబోయే మూడు దశాబ్దాలే నిర్వచిస్తాయ’ని గౌతమ్ అదానీ తెలిపారు. ప్రపంచీకరణ పరుగులో ఒకప్పటి ఛాంపియన్గా ఉన్న చైనా.. నేడు సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ‘ప్రపంచ దృష్టిలో ఒంటరి అవుతున్నాననే భావన చైనాలో పెరుగుతోందని అనుకుంటున్నాను. జాతీయవాదం పెరగడం, సరఫరా వ్యవస్థలు ఇతర దేశాలకు మళ్లడం, సాంకేతిక ఆంక్షలు లాంటివి ఆ దేశానికి ముప్పుగా మారతాయ’ని అదానీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల కల్పనతో ముందుకు వెళ్లాలన్న చైనా ఆకాంక్షలకు పలు దేశాల్లో వ్యతిరేకత ఎదురవుతోందని గుర్తు చేశారు. చైనా స్థిరాస్తి విపణి నెమ్మదించడం... 1990ల్లో జపాన్ ఆర్థిక వ్యవస్థ పరిణామాలను గుర్తుకు తెస్తోందని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థలు కొంత కాలానికి తిరిగి పుంజుకుంటాయని తాను భావిస్తున్నప్పటికీ.. ఈసారి మాత్రం కష్టంగానే ఉందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!