డేటా కేంద్రాల్లోకి రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడులు
గత అయిదేళ్లలో భారత డేటా కేంద్రాల మార్కెట్లోకి 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, 2025 నాటికి ఈ మొత్తం పెట్టుబడుల 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.6 లక్షల కోట్లు)ను అధిగమించొచ్చని స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది.
2025కు చేరొచ్చు: సీబీఆర్ఈ
దిల్లీ: గత అయిదేళ్లలో భారత డేటా కేంద్రాల మార్కెట్లోకి 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, 2025 నాటికి ఈ మొత్తం పెట్టుబడుల 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.6 లక్షల కోట్లు)ను అధిగమించొచ్చని స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. పెట్టుబడిదార్లు స్థిర ఆదాయం తెచ్చే ఆస్తుల కోసం చూస్తున్నట్లు తెలిపింది. ‘డేటా సెంటర్స్ ఇన్ ఇండియా: పవరింగ్ అప్ రియల్ ఎస్టేట్ ఇన్ ఏ డేటా-హై ఎరా’ పేరిట సీబీఆర్ఈ నివేదికను వెలువరించింది. డిజిటలీకరణ పెరగడం, విధానపరమైన తోడ్పాటుతో డేటా కేంద్రాలకు గిరాకీ గణనీయంగా పెరిగిందని పేర్కొంది. కొవిడ్-19 సంక్షోభంతో సాంకేతికతను అందిపుచ్చుకోవడం, డేటా వినియోగం అధికమైనట్లు వివరించింది.
* ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, స్మార్ట్ఫోన్ వినియోగం, ఇ-కామర్స్, ఎడ్టెక్ సంస్థల ఆన్లైన్ స్కూలింగ్, లొకేషన్-అగ్నోస్టిక్ పని, మెషీన్ లెర్నింగ్, 5జీ, బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతల కారణంగా డేటా పంపిణీ పలు రెట్లు పెరుగుతోంది. దీంతో అధిక వేగంతో కూడిన సర్వర్ల అవసరం పెరిగింది.
* ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదార్లకు ప్రత్యామ్నాయ స్థిరాస్తి పెట్టుబడిగా డేటా కేంద్రాలు మారాయి. స్థిరమైన ఆదాయం అందించేందుకు అవకాశంగా ఉన్న వీటిల్లోకి పెట్టుబడులు కొత్త గరిష్ఠాలకు చేరే సూచనలున్నాయి.
* డేటా కేంద్రాలకు ప్రభుత్వం మౌలిక రంగ హోదా కల్పించడంతో పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఇప్పటికే 14 బి.డాలర్ల పెట్టుబడులు రాగా.. వచ్చే మూడేళ్లలో మరో 6 బి.డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
* అన్ని రంగాల్లో వ్యాపార సంస్థలు డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణకు చూస్తున్నాయి, ప్రత్యామ్నాయ స్థిరాస్తి పెట్టుబడిగా డేటా కేంద్రాలకు ప్రాధాన్యత పెరిగిందని సీబీఆర్ఈ ఛైర్మన్, సీఈఓ (భారత్) అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా గిరాకీ పెరగొచ్చని అంచనా వేశారు.
* భారత్లోని డేటా కేంద్రాల్లో 48 శాతం ముంబయిలో ఉండగా, బెంగళూరులో 18 శాతం, చెన్నైలో 9 శాతం ఉన్నాయి. దిల్లీ-ఎన్సీఆర్, పుణె, హైదరాబాద్, కోల్కతాలలో మిగతా 25 శాతం డేటా కేంద్రాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం