57,000 దిగువకు సెన్సెక్స్
బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో, సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టపోయాయి. లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 57000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 16,900 కింద ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు
ఆరో రోజూ కొనసాగిన నష్టాలు
రికార్డు కనిష్ఠమైన 81.93కు రూపాయి
సమీక్ష
బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో, సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టపోయాయి. లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 57000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 16,900 కింద ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 82.02కు పతనమైనా, చివరకు 40 పైసలు కోల్పోయి తాజా జీవనకాల కనిష్ఠమైన 81.93 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర స్వల్పంగా తగ్గి 86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ఎంపీసీ సమావేశ నిర్ణయాలు శుక్రవారం వెల్లడికానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు.
సెన్సెక్స్ ఉదయం 56,710.13 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై.. ఒకదశలో 56,485.67 పాయింట్లకు పడిపోయింది. అనంతరం కోలుకుని లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్, 57,213.13 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 509.24 పాయింట్ల నష్టంతో 56,598.28 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 148.80 పాయింట్లు తగ్గి 16,858.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,820.40- 17,037.60 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 18 నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ 2.97%, యాక్సిస్ బ్యాంక్ 2.84%, రిలయన్స్ 2.64%, టాటా స్టీల్ 2.64%, ఎస్బీఐ 2.04%, హెచ్డీఎఫ్సీ 2.02%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.97%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.85%, బజాజ్ ఫిన్సర్వ్ 1.70% చొప్పున నీరసించాయి. ఏషియన్ పెయింట్స్ 2.90%, సన్ఫార్మా 2.37%, డాక్టర్ రెడ్డీస్ 2.03%, పవర్గ్రిడ్ 1.42%, నెస్లే 0.99% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 2.32%, బ్యాంకింగ్ 1.52%, ఆర్థిక సేవలు 1.31%, ఇంధన 1.09%, కమొడిటీస్ 1.06%, స్థిరాస్తి 0.76% డీలాపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఐటీ, వినియోగ, టెక్ మెరిశాయి. బీఎస్ఈలో 2161 షేర్లు నష్టాల్లో ముగియగా, 1277 స్క్రిప్లు లాభపడ్డాయి. 94 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* సుజ్లాన్ ఎనర్జీ రూ.1200 కోట్ల రైట్స్ ఇష్యూ అక్టోబరు 11న ప్రారంభమై 14న ముగియనుంది. రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.5 ధర నిర్ణయించారు. కంపెనీ 2.40 కోట్ల షేర్లను జారీ చేయనుంది. అర్హులైన వాటాదార్లకు ప్రతి 21 ఫుల్లీ పెయిడప్ ఈక్విటీ షేర్లకు 5 రైట్స్ ఇష్యూ ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. రికార్డు తేదీగా అక్టోబరు 4ను నిర్ణయించారు. ఈ షేరు ధర బీఎస్ఈలో రూ.8.15గా ఉంది.
* కంపెనీ తీసుకున్న రుణాలకు హామీగా అనుబంధ సంస్థ ఏసీసీలో 50.5 శాతం వాటాను తనఖా పెట్టినట్లు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. సెప్టెంబరు 26న 9.39 కోట్ల ఏసీసీ షేర్లను తనఖా పెట్టినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన