పసిడి ‘చిన్న దుకాణాల’ వాటా తగ్గుతోంది
దేశీయ ఆభరణాల విక్రయాల్లో చిన్న వ్యాపారుల హవాయే ఇప్పటికీ కొనసాగుతున్నా, వాటి వాటా క్రమంగా తగ్గుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో పేర్కొంది. సంఘటిత రంగం వాటా వచ్చే ఐదేళ్లలో మరింతగా పెరిగి 40
అయిదేళ్లలో చెయిన్ స్టోర్ల వాటా 40 శాతానికి
5 దిగ్గజ సంస్థల నుంచే మరో 1000 కేంద్రాలు
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక
దిల్లీ: దేశీయ ఆభరణాల విక్రయాల్లో చిన్న వ్యాపారుల హవాయే ఇప్పటికీ కొనసాగుతున్నా, వాటి వాటా క్రమంగా తగ్గుతోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో పేర్కొంది. సంఘటిత రంగం వాటా వచ్చే ఐదేళ్లలో మరింతగా పెరిగి 40 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. పెద్ద సంస్థలు నిర్వహిస్తున్న గొలుసుకట్టు దుకాణాలు (చెయిన్ స్టోర్స్) సంఘటిత రంగం కిందకు వస్తుండగా.. సొంతంగా చిన్న విక్రయదార్లు నిర్వహించే దుకాణాలను అసంఘటిత రంగంగా పరిగణిస్తుంటారు. గత పదేళ్లుగా చెయిన్ స్టోర్స్ మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతూ 2021కి 35 శాతానికి చేరుకుందని డబ్ల్యూజీసీ పేర్కొంది. ఐదేళ్లలో ఇది 40 శాతానికి పెరగొచ్చని భారత మార్కెట్పై రూపొందించిన నివేదికలో తెలిపింది. ఈ సమయంలో 5 దిగ్గజ రిటైల్ సంస్థలే కొత్తగా 800- 1000 విక్రయ కేంద్రాలు తెరిచే అవకాశం ఉందని పేర్కొంది.
‘హాల్ మార్కింగ్ను తప్పనిసరి చేయడం, అందరికీ వ్యాపారపరంగా సమాన అనుకూల పరిస్థితులు సృష్టించడం వల్ల దేశీయంగా, స్థానికంగా చెయిన్ స్టోర్ల మార్కెట్ వాటా పెరుగుతోంది. రుణాలు పొందే సౌలభ్యం ఎక్కువగా ఉండటం, అధిక నిల్వలను కలిగి ఉండటమూ వీటికి తోడ్పడతాయి. చెయిన్ స్టోర్ల మాదిరి చిన్న విక్రయకేంద్రాలు కూడా రుణాల సౌలభ్యాన్ని పొందాలంటే మరింత పారదర్శకంగా మారాలి. సాంకేతికతనూ అందిపుచ్చుకోవాలి. అప్పుడే అవి తమ మార్కెట్ వాటాను కాపాడుకునే అవకాశం ఉంటుంద’ని డబ్ల్యూజీసీ, ఇండియా, రీజినల్ సీఈఓ పి.ఆర్.సోమసుందరం చెప్పారు. దేశంలో ఆభరణాల విక్రయ సంస్థలు అయిదారు లక్షలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
రోజువారీ ధరించే వాటిపై దృష్టి
‘అత్యుత్తమ డిజైన్లు, వినియోగదారు అనుభూతి, హాల్మార్కింగ్పై పెరుగుతున్న అవగాహన, అత్యుత్తమ ధర నిర్ణయం, వెనక్కి ఇచ్చే విధానాలు, జీఎస్టీ, నోట్లరద్దు లాంటివి చెయిర్ స్టోర్ల వైపు వినియోగదారుల అడుగులు వేగంగా పడేందుకు కారణమయ్యాయ’ని నివేదిక తెలిపింది. రోజువారీ ధరించే ఆభరణాలు, గొలుసులు, ఉంగరాలు లాంటి వేగంగా అమ్ముడుపోయే ఆభరణాలపై చెయిన్ స్టోర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని పేర్కొంది. వీటి వ్యాపారంలో ఆ తరహా ఆభరణాలే 50-60 శాతం ఉంటాయని తెలిపింది.
* పసిడి ఆభరణాల తయారీలోనూ సంఘటిత రంగం తన వాటా పెంచుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయని తెలిపింది.
ఆన్లైన్లో.. తక్కువ పరిమాణంలో
ఆన్లైన్ ద్వారా ఆభరణాల కొనుగోళ్లు ఇటీవల పెరిగాయని నివేదిక తెలిపింది. అయితే ఈ కొనుగోళ్ల పరిమాణం 5- 10 గ్రాముల ఆభరణాలకే పరిమితమవుతున్నట్లు వెల్లడించింది. 18 క్యారెట్ల నాణ్యత కలిగిన, తేలికపాటి, ఫ్యాషన్ పసిడి ఆభరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో ఆన్లైన్ కొనుగోళ్ల వాటా 7- 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది. -
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!