+568 నుంచి -188 పాయింట్లకు
వరుసగా ఏడో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు శుక్రవారం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించడమే ఇందుకు కారణం. సెప్టెంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియడంతో, సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
ఏడో రోజూ కొనసాగిన అమ్మకాలు
సమీక్ష
వరుసగా ఏడో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు శుక్రవారం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తత పాటించడమే ఇందుకు కారణం. సెప్టెంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియడంతో, సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 568 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్, చివరకు 188 పాయింట్లు నష్టపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి 20 పైసలు పెరిగి 81.73 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు ధర 0.45 శాతం తగ్గి 88.92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్ నష్టపోగా, సియోల్, టోక్యో లాభపడ్డాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.
సెన్సెక్స్ ఉదయం 56,997.90 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. 57,166.14 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో ఆరంభ లాభాలు పొగొట్టుకుని, ఒకదశలో 56,314.05 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 188.32 పాయింట్ల నష్టంతో 56,409.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 40.50 పాయింట్లు తగ్గి 16,818.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,788.60- 17,026.05 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 16 డీలాపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 5.22%, టెక్ మహీంద్రా 1.86%, టైటన్ 1.69%, కోటక్ బ్యాంక్ 1.52%, బజాజ్ ఫైనాన్స్ 1.36%, టీసీఎస్ 1.32%, విప్రో 1.14%, మారుతీ 1.09%, ఎల్ అండ్ టీ 1% మేర నష్టపోయాయి. ఐటీసీ 2.51%, డాక్టర్ రెడ్డీస్ 2.16%, టాటా స్టీల్ 1.68%, సన్ఫార్మా 1.38%, ఎం అండ్ ఎం 1.13%, ఎన్టీపీసీ 0.92% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్ 1.38%, విద్యుత్ 1.30%, ఐటీ 0.60%, వినియోగ 0.47%, టెక్ 0.34% పడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎమ్సీజీ, స్థిరాస్తి, కమొడిటీస్, పరిశ్రమలు రాణించాయి.
* రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర-పవన విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించినట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకటించింది. ఈ ప్లాంట్కు 600 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి, 150 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఈ ప్లాంట్కు విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉందని, 25 ఏళ్ల పాటు కిలోవాట్ను రూ.2.69 చొప్పున ఆ సంస్థ కొనుగోలు చేయనుందని అదానీ గ్రీన్ తెలిపింది.
* ఉత్తర్ ప్రదేశ్లోని ఆరు లేన్ల కొత్త గంగా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ కోసం అనుబంధ సంస్థలు రూ.10,238 కోట్ల నిధులు సమీకరించినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది.
2020 కనిష్ఠాలకు అమెరికా మార్కెట్లు: మాంద్యం భయాలతో అమెరికా మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.45 గంటలకు డోజోన్స్ 600 పాయింట్లు, ఎస్ అండ్ పీ 100 పాయింట్లు, నాస్డాక్ 400 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. 2020 తర్వాత ఎస్ అండ్ పీ సూచీ కనిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. బాండు రాబడులు పెరగడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు