ఐపీఓ నిబంధనలు కఠినతరం
పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. గత లావాదేవీలు, నిధుల సమీకరణ కార్యకలాపాల ఆధారంగా ఆఫర్ ధరను కంపెనీలు వెల్లడించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.
ముంబయి: పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. గత లావాదేవీలు, నిధుల సమీకరణ కార్యకలాపాల ఆధారంగా ఆఫర్ ధరను కంపెనీలు వెల్లడించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. భవిష్యత్లో పబ్లిక్ ఇష్యూకు వచ్చే పక్షంలో ఆ విషయాన్ని ‘ప్రీ-ఫైలింగ్’ పత్రాల ద్వారా తెలిపే ప్రతిపాదనకూ సెబీ బోర్డు అనుమతినిచ్చింది. దీని కింద ప్రజలకు సునిశిత సమాచారాన్ని తెలపాల్సిన అవసరం ఉండదు. కేవలం సెబీ, ఎక్స్ఛేంజీలకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సెబీ ప్రాథమిక పరిశీలన అనంతరం వీటిని ప్రజల(పెట్టుబడుదార్ల) ముందుకు తీసుకొస్తారు. పెట్టుబడుల నిర్ణయానికి కనీసం 21 రోజుల సమయం వీరికి ఉండేలా చూస్తామని సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రత్నామ్నాయ ‘ప్రీ-ఫైలింగ్’ విధానంతో పాటు ప్రస్తుతం ఉన్న పత్రాల ప్రక్రియ కూడా కొనసాగుతుందని తెలిపింది.
స్వతంత్ర డైరెక్టర్ల నియామాకాలు, తొలగింపులు సులువిక: కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్ల నియామకం, తొలగింపునకు సంబంధించిన కొత్త విధానానికి సెబీ ఆమోదం తెలిపింది. ఈ చర్య వల్ల స్వతంత్ర డైరెక్టర్ల నియామకం లేదా తొలగింపు ప్రక్రియ సులువు కానుంది. ఒక్కసారి నిబంధనలకు సవరణలు జరిగితే.. సాధారణ తీర్మానం; మైనారిటీ వాటాదార్ల మెజారిటీ అనే రెండు అంశాల ద్వారా స్వతంత్ర డైరెక్టర్ల నియామకం, తొలగింపు జరుగుతుంది. ప్రస్తుతం నియామకం, పునర్నియామకం లేదా తొలగింపునకు ప్రత్యేక తీర్మానాన్ని చేపడుతున్నారు. కాగా, తొలిసారి(ఫస్ట్ టర్మ్) జరిపే నియామకం, తొలగింపునకు ప్రత్యామ్నాయ పద్ధతికి సెబీ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. దీని కింద ప్రత్యేక తీర్మానంలో సరైన మెజారిటీ లభించని పక్షంలో సాధారణ తీర్మానం, మైనారిటీ వాటాదార్ల మెజారిటీకి వెళ్లి నియామకం/తొలగింపులను చేపట్టవచ్చన్నమాట.
పోర్ట్ఫోలియో మేనేజర్లకు నిబంధనలు: ఒక ఫండ్లో పోర్ట్ఫోలియో మేనేజర్ల పాత్ర, బాధ్యతలు; అదే సమయంలో క్లయింట్ ఫండ్లు, సెక్యూరిటీల నిర్వహణలో రిస్క్ మేనేజ్మెంట్ విషయాలను తెలుపుతూ రాతపూర్వకంగా ఇవ్వాలంటూ పోర్ట్ఫోలియో మేనేజర్లను సెబీ కోరింది. ప్రతి క్లయింటునకు చెందిన ఫండ్లు, సెక్యూరిటీలను తమ సొంత ఫండ్లు, సెక్యూరిటీలకు దూరంగా ఉంచాలన్న నిబంధనను సైతం విధించింది.
ఆరు నెలల పాటు నిషేధం: మహంకాల్ క్యాపిటల్, ఆ సంస్థ యజమాని అజయ్ఠాకూర్, మనీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ సంస్థ యజమాని విజయ్ ఠాకూర్లు సెక్యూరిటీ మార్కెట్లలో పాలుపంచుకోకుండా ఆరు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. అనుమతులు లేకుండా పెట్టుబడుల సలహా సేవలను అందించినందుకు ఈ రెండు సంస్థలు, ఇద్దరు వ్యక్తులపై ఈ చర్య తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్