ద్రవ్యలోటు రూ.5.41 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు ద్రవ్యలోటు రూ.5,41,601 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యం (రూ.16.61 లక్షల కోట్ల)లో ఇది 32.6 శాతానికి సమానం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
వార్షిక లక్ష్యంలో 32.6 శాతానికి
ఏప్రిల్-ఆగస్టులోనే
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు ద్రవ్యలోటు రూ.5,41,601 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యం (రూ.16.61 లక్షల కోట్ల)లో ఇది 32.6 శాతానికి సమానం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ మొత్తం వసూళ్లు (పన్నులు సహా) రూ.8.48 లక్షల కోట్లు లేదా బడ్జెట్ అంచనా (2022-23)ల్లో 37.2 శాతంగా ఉన్నాయి. 2021-22 ఇదే సమయానికి వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో 40.9 శాతంగా ఉన్నాయి. సమీక్షా కాలంలో పన్ను ఆదాయాలు రూ.7 లక్షల కోట్లు లేదా ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో 36.2 శాతంగా నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాలు రూ.13.9 లక్షల కోట్లు లేదా 2022-23 బడ్జెట్ అంచనాల్లో 35.2 శాతంగా నమోదయ్యాయి. 2021-22 ఇదే సమయానికి బడ్జెట్ అంచనాల్లో ఇవి 36.7 శాతంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతానికి పరిమితం కావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.
9 నెలల కనిష్ఠానికి కీలక రంగాల వృద్ధి
దిల్లీ: ఎనిమిది కీలక మౌలిక వసతుల రంగాల ఉత్పత్తి ఆగస్టులో 3.3 శాతం వృద్ధి చెందింది. ఇది తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయి. 2021 ఆగస్టులో 12.2 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం కనిష్ఠ స్థాయి 2021 నవంబరులో నమోదైన 3.2 శాతమే. ఈ ఏడాది జులైలో కూడా వృద్ధి 4.5 శాతం కావడం గమనార్హం.
* ఆగస్టులో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి వరుసగా 3.3%, 0.9% చొప్పున క్షీణించాయి. * ఎరువుల ఉత్పత్తి 11.9 శాతం రాణించింది. * బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు, విద్యుదుత్పత్తి వృద్ధి రేట్లు వరుసగా 7.6%, 7%, 2.2%, 1.8%, 0.9 శాతానికి పరిమితమయ్యాయి.
ఏప్రిల్-ఆగస్టులో..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టులో 8 కీలక రంగాల (బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్) ఉత్పత్తిలో వృద్ధి 9.8 శాతంగా నమోదైంది. 2021 ఇదే అయిదు నెలల్లో నమోదైన 19.4 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం