5జీ సేవలకు నేడు శ్రీకారం

దేశంలో 5జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో అక్టోబరు 1-4 తేదీల్లో జరగనున్న 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2022 కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు 5జీ సేవలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

Updated : 01 Oct 2022 07:16 IST

దిల్లీ: దేశంలో 5జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో అక్టోబరు 1-4 తేదీల్లో జరగనున్న 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2022 కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు 5జీ సేవలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. 5జీ సేవలు తొలుత ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభమై, వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. భారత్‌పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2035 నాటికి 450 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36 లక్షల కోట్ల)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుత 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు. దేశంలోని 3 ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. జియో రూ.88,078 కోట్లు, ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి.
భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ కనెక్షన్‌ను వినియోగించుకుని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ వారణాసి నుంచి; జియో కనెక్షన్‌ సాయంతో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్‌ నుంచి ప్రధానితో సంభాషిస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని