సంక్షిప్త వార్తలు
తన డ్రీమ్లైనర్ విమానాల్లో లైవ్ టీవీ ఛానల్ సేవలను ‘విస్తారా’ ప్రారంభించింది. వచ్చే కొద్ది నెలల్లో ఇతర విమానాల్లోనూ తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీకి 53 విమానాలుండగా అందులో రెండు బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్లు ఉన్నాయి.
విస్తారా విమానాల్లో లైవ్ టీవీ ఛానళ్లు
దిల్లీ: తన డ్రీమ్లైనర్ విమానాల్లో లైవ్ టీవీ ఛానల్ సేవలను ‘విస్తారా’ ప్రారంభించింది. వచ్చే కొద్ది నెలల్లో ఇతర విమానాల్లోనూ తీసుకురానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కంపెనీకి 53 విమానాలుండగా అందులో రెండు బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్లు ఉన్నాయి. ‘మా బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానాల్లో లైవ్ టీవీను తీసుకొచ్చాం. రెండు స్పోర్ట్స్ ఛానళ్లు, మూడు వార్తా ఛానళ్లు అందుబాటులో ఉంటాయ’ని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విమానాలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ విక్రయాలు పెరిగాయ్
దిల్లీ: పండగల సీజన్ ప్రారంభం కావడంతో సెప్టెంబరులో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో వృద్ధి నమోదైంది. రుతు పవనాలు చివరిదశకు చేరుకోవడం కూడా గిరాకీ పెరగడానికి దోహదపడింది. సెప్టెంబరులో పెట్రోల్ విక్రయాలు 13.2 శాతం పెరిగి 2.65 బిలియన్ టన్నులకు చేరాయి. ఏడాది క్రితం సెప్టెంబరులో విక్రయాలు 20.7 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. 2020 సెప్టెంబరుతో పోలిస్తే విక్రయాలు 20.7 శాతం, 2019 సెప్టెంబరుతో పోలిస్తే 23.3 శాతం వృద్ధి చెందాయి. ఇక డీజిల్ విక్రయాలు సెప్టెంబరులో 22.6 శాతం వృద్ధితో 5.99 మి.టన్నులకు చేరాయి. విమాన ఇంధన గిరాకీ 41.7 శాతం పెరిగి 5,44,700 టన్నులకు చేరింది. వంట గ్యాస్ విక్రయాలు 5.4 శాతం పెరిగి 2.48 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి.
విద్యుత్ ఎస్యూవీలకూ ఫోర్ వీల్ డ్రైవ్ సాంకేతికత
టాటా మోటార్స్
దిల్లీ: విద్యుత్ వెర్షన్ స్పోర్ట్స్ వినియోగ వాహనాలకూ (ఎస్యూవీలు) ఫోర్ వీల్ డ్రైవ్ సాంకేతికతను పరిచయం చేసేందుకు చూస్తున్నామని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల బిజినెస్ హెడ్ శైలేష్ చంద్ర వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెక్సాన్, హ్యారియర్, సఫారీలతో పాటు ఏ విద్యుత్ ఎస్యూవీలోనూ ఈ తరహా సాంకేతికతను వినియోగించలేదని పేర్కొన్నారు. 2025 నాటికి కంపెనీ పోర్ట్ఫోలియోలో 10 కొత్త మోడల్ విద్యుత్ కార్లు ఉండేలా చూసుకుంటామని తెలిపారు. పోటీ సంస్థలైన ఎం అండ్ ఎం తమ ఎక్స్యూవీ 700, స్కార్పియో-ఎన్, థార్, ఆల్ట్రాస్ జీ4 మోడళ్లలో ఫోర్ వీల్ డ్రైవ్ సాంకేతికతను వినియోగిస్తోంది. మారుతీ సుజుకీ కూడా ఇటీవల విడుదల చేసిన మధ్యస్థాయి ఎస్యూవీ గ్రాండ్ విటారాలో ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సాంకేతికతను వినియోగించింది.
కర్ణాటక బ్యాంక్ ‘కేబీఎల్ ఉత్సవ్’
మంగళూరు: ప్రైవేట్ రంగంలోని కర్ణాటక బ్యాంక్ ‘కేబీఎల్ ఉత్సవ్ 2022-23’ పేరిట గృహ, కారు, పసిడి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. పండగ సీజన్లో ఖాతాదార్ల గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31 వరకు రుణాలు అందించబోతున్నట్లు తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్తో పాటు తమ 880 శాఖల ద్వారా ఈ ప్రత్యేక రుణ ఆఫర్లు పొందవచ్చని ప్రకటనలో తెలిపింది. కేబీఎల్ ఉత్సవ్లో భాగంగా ఆకర్షణీయ వడ్డీ రేట్లకు రుణాలు అందించడమే కాకుండా కారు, పసిడి రుణాలకు ప్రాసెసింగ్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. గృహ రుణాలకు అసలు ప్రాసెసింగ్ ఛార్జీని పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించింది.
చమురు-గ్యాస్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టండి
అమెరికా సంస్థలకు భారత్ పిలుపు
హూస్టన్: దేశీయ చమురు-గ్యాస్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా దిగ్గజ సంస్థలను భారత్ కోరింది. సానుకూల భౌగోళిక పరిస్థితులు, డేటా అందుబాటు, తోడ్పాటు ఇచ్చే విధానాలు, సులభతర వాణిజ్యం వంటివి సానుకూలాంశాలుగా పేర్కొంది. పెట్టుబడిదార్లను ఆకర్షించేందుకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కింద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) రెండు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించింది. 50కు పైగా చమురు-గ్యాస్ దిగ్గజాలు, ఆర్థిక సంస్థలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు ఇందులో పాల్గొనగా.. భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ కోరారు. అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుంది, భారత ఇంధన రంగంలో అపార అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
సంక్షిప్తాలు
* 5జీ సాంకేతికత కోసం దేశవ్యాప్తంగా 100 ల్యాబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు.. అందులో కనీసం పన్నెండింటిని విద్యార్థులకు శిక్షణ, ప్రయోగాల నిర్వహణకు వినియోగించనున్నట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
* యూనిఫైడ్ కేవైసీ(నో యువర్ కస్టమర్) వ్యవస్థను ఏర్పాటు చేయాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ ప్రతిపాదించింది. ఇది అందరు టెలికాం ఆపరేటర్లకు అందుబాటులో ఉంటుందని.. తద్వారా మోసపూరిత కాలర్లను; స్పామర్లను అడ్డుకోవచ్చని ట్రాయ్ ఛైర్మన్ పీడీ వాఘేలా పేర్కొన్నారు.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.2 శాతానికి పరిమితం కావొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. సాధారణ వర్షాలతో పాటు సరఫరా వ్యవస్థలు సాధారణ స్థాయికి చేరడం; విధానాల పరంగా కఠినత్వం ఉండకపోవడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయంటోంది.
* 2024 కల్లా దేశవ్యాప్తంగా 100 స్టోర్లను తెరవనున్నట్లు సైకిల్ ప్యూర్ అగరబత్తీస్ తయారీదారు ఎన్ఆర్ గ్రూప్ పేర్కొంది. ప్రస్తుతం 32 స్టోర్లున్నాయని.. మార్చి 2023 కల్లా ఇవి 50 స్టోర్లకు చేర్చుతామని తెలిపింది.
* భారత్లో ఇ-కామర్స్కు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. చెల్లింపులు, ఆర్డర్లు, రిఫండ్లు, రద్దుల వంటి 24 అంశాలపై 31 అక్టోబరులోగా ప్రజలు స్పందన తెలపవచ్చని పేర్కొంది.
* పీవీఆర్ షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ముగ్గురు వ్యక్తుల(గౌతమ్ దత్తా, ఎన్సీ గుప్తా, ప్రమోద్ అరోరా)పై మొత్తం రూ.6 లక్షల అపరాధ రుసుమును సెబీ విధించింది.
* బ్యాంకు ఖాతాలను గరిష్ఠ స్థాయికి చేర్చడం, కిసాన్ క్రెడిట్ కార్డులను విస్తరించడం వంటి ఆర్థిక సంఘటిత కార్యకలాపాల కోసం ప్రత్యేక డ్రైవ్ను అక్టోబరు 15 నుంచి నవంబరు 26 వరకు నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.
* ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రూ.5551.27 కోట్లలో 84 శాతానికి పైగా అమెరికాకు చెందిన చిప్ కంపెనీ క్వాల్కామ్కు చేసిన రాయల్టీ చెల్లింపే ఉందని షియోమీ పేర్కొంది. ఫెమా కింద షియోమీకి చెందిన రూ.5551.27 కోట్ల విలువైన డిపాజిట్లను జప్తు చేయడానికి ఈడీ ఆమోదించిన సంగతి తెలిసిందే.
వంట నూనెలపై దిగుమతి సుంకం రాయితీ పొడిగింపు
దిల్లీ: వంట నూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీని 2023 మార్చి వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే మరో 6 నెలల పాటు రాయితీని పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు దిగొస్తున్నాయని, ఫలితంగా దేశీయంగానూ ధరలు అదుపులోకి వస్తున్నాయని పేర్కొంది. తాజా నిర్ణయంతో ముడి, రిఫైన్డ్ పామాయిల్, ముడి, రిఫైన్డ్ సోయాబీన్, ముడి, రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనెలపై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలు యథాతథంగా కొనసాగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?